ఐటీ దిగ్గజం అదిరిపోయే శుభవార్త.. 20 వేల నియామకాలు.. వేతనాల పెంపు!

Wait 5 sec.

: దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS).. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) ఫలితాల్ని తొలుత ప్రకటించగా అంచనాల్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఇలా వరుసగా ఫలితాల్ని ప్రకటించాయి. చాలా వరకు స్వల్ప లాభాలే నమోదు చేశాయి. ఇదే సమయంలో టీసీఎస్.. ఏఐ మార్పులు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా.. ఇది ఐటీ రంగంలో పెద్ద కలకలమే సృష్టించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. మరోవైపు రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ప్రకటించింది. ఇప్పుడు మరో ఐటీ దిగ్గజ సంస్థ కూడా కీలక ప్రకటన చేసింది. అదే అంతర్జాతీయ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్. అమెరికాకు చెందిన ఈ ఎంఎన్‌సీ కంపెనీకి ఇండియాలో సగానికిపైగా ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం ఐటీ రంగంలో అనిశ్చితి ఉన్నప్పటికీ.. 2025లో 15000- 20000 మంది తాజా ఉత్తీర్ణుల్ని (ఫ్రెషర్స్) నియమించుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగ్నిజెంట్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తుంది. ఏప్రిల్- జూన్ ఇండియాలో కార్పొరేట్ కంపెనీలకు తొలి త్రైమాసికం కాగా.. కాగ్నిజెంట్‌కు ఇది రెండో త్రైమాసికం. ఇప్పుడు ఈ క్యూ2 త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించగా.. ఉద్యోగుల నియామకాలపైనా ప్రకటన చేసింది. ఈ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు 7500 మంది ఉద్యోగుల్ని నియమించుకోగా.. మొత్తం సిబ్బంది 3,42,800 కు చేరింది. వేతనాల పెంపుపై ప్రకటన..మరోవైపు వేతనాల పెంపుపైనా ప్రకటన చేసింది. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో సిబ్బందికి వేతన పెంపు అమలు చేస్తామని సంస్థ సంకేతాలు ఇచ్చింది. దీనికి సరైన సమయం మాత్రం వెల్లడించలేదు. ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో ఈ ఐటీ దిగ్గజం అంచనాలకు మించి రాణించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంతో పోలిస్తే కాగ్నిజెంట్ నికర లాభం 14 శాతం వరకు పెరిగి 645 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇక ఈ ఏడాదికి ఆర్థిక వృద్ధి అంచనాల్ని కాగ్నిజెంట్ 4-6 శాతానికి పెంచింది. ఇక సమీక్షా త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ సంవత్సరం తొలి అర్ధభాగంలో కంపెనీ పనితీరు బాగుందని.. దానికి అనుగుణంగానే ఆదాయ అంచనాల్ని కూడా పెంచినట్లు సంస్థ సీఈఓ రవి కుమార్ తెలిపారు. ఇదే సమయంలో మూడో త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం 5.27- 5.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. తమకు ఏఐ ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నాయని.. ఏడాది వ్యవధిలో ఈ ప్రాజెక్టుల సంఖ్య 1400 నుంచి 2500 కు పెరిగినట్లు తెలిపారు. మొత్తం 30 కోడ్స్‌ను.. మెషీన్లే రాసినట్లు రవి కుమార్ పేర్కొన్నారు.