కుమార్ ‘అధర్మసేన’.. ఇంగ్లాండ్‌కు దొంగచాటుగా హెల్ప్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అంపైర్!

Wait 5 sec.

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తొలి సెషన్ ఆటలో వ్యవహార శైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. తటస్థంగా ఉండాల్సిన అంపైర్.. ఇంగ్లాండ్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. అందుకు సాక్ష్యాలను సైతం షేర్ చేస్తున్నారు.అసలేం జరిగిందంటే..?ది ఓవల్ టెస్ట్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే ఈ మ్యాచ్ 13వ ఓవర్‌లో జోష్ టంగ్ బౌలింగ్‌కు దిగాడు. ఆ ఓవర్ రెండో బంతిని సాయి సుదర్శన్ ఎదుర్కొన్నాడు. ఇన్‌ స్వింగ్ యార్కర్‌గా వచ్చిన బంతిని ఆడే క్రమంలో సాయి సుదర్శన్ కిందపడ్డాడు. కానీ అంతకు ముందే బంతి బ్యాట్‌కు ఎడ్జ్ అయింది. ఈ విషయాన్ని గమనించని ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. కానీ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. ఇక్కడి వరకు అంతా ఓకే కానీ.. ఇప్పుడు ధర్మసేన చేసిన పనిపైనే చర్చ మొదలైంది.ఆన్ ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన 15 సెకన్ల డీఆర్‌ఎస్ టైమర్ ముగియక ముందే బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్‌ అయిందని తన చేతి వేళ్లతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు కనిపించేలా సంజ్ఞ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ రివ్యూ తీసుకోలేదు. అంపైరే చెప్పేశాడుగా అని.. డీఆర్ఎస్ జోలికి వెళ్లలేదు. కానీ ధర్మసేన తీరు పరోక్షంగా ఇంగ్లాండ్‌కు సహకరించినట్లయ్యింది. ఎందుకంటే అతడు బ్యాట్‌కు బంతి తాకిందని చేతి వేళ్లతో సైగ చేయకపోతే.. ఇంగ్లాండ్ రివ్యూకి వెళ్లేది. అప్పుడు ఒక రివ్యూను కోల్పోయేది.ఇది చూసిన నెటిజన్లు అంపైర్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్ సైగ చేయడంతోనే ఇంగ్లాండ్ రివ్యూ తీసుకోలేదని, తటస్థంగా ఉండాల్సిన అంపైర్లు ఇలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని టీమిండియా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఐసీసీ ప్రోటోకాల్స్ ప్రకారం ఆన్ ఫీల్డ్ అంపైర్లు డీఆర్ఎస్ టైమర్ 15 సెకన్లు ఆన్‌లో ఉన్న సమయంలో బంతి బ్యాట్‌కు తాకినట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సిగ్నల్స్ ఇవ్వకూడదు. ఇది ఆటగాళ్ల రివ్యూ ఛాయిస్‌ను ప్రభావితం చేసినట్లు అవుతుంది. ధర్మసేన చేసిన పని ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. రూల్స్ ప్రకారం అంపైర్లు ఔట్ లేదా నాటౌట్ అనే సిగ్నల్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో అంపైర్లు ఇలా ఇన్‌ఫార్మల్ సిగ్నల్స్ ఇస్తున్నారు. ఓవల్ టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అర్ధ సెంచరీ చేసిన కరుణ్ నాయర్‌కు తోడుగా వాషింగ్టన్ సుందర్ క్రీజ్‌లో ఉన్నాడు.