హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్ అభిమానుల్ని, ప్రజల్ని అలర్ట్ చేశారు. తన పేరుతో మోసం జరుగుతోందని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిసిందని.. కానీ ఆ కార్యక్రమానికి తనకు సంబంధం లేదన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే ఇలా ప్రచారం చేస్తున్నారని.. ఎవరూ నమ్మొద్దన్నారు.‘ప్రజలకు హెచ్చరిక!.." – బసవతారకం ఈవెంట్" పేరిట అనే వ్యక్తి నా పేరు, మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రజలందరికి నేను స్పష్టంగా తెలియజేయదలచుకున్న విషయం: ఈ ఈవెంట్‌కు నా అనుమతి లేదు. హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి.. దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు’ అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఛైర్మన్‌గా ఉన్నారు.. అయితే పలువురు ఆస్పత్రికి విరాళాలను అందజేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో "బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్" పేరుతో ప్రచారం జరుగుతోందట. అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి బాలయ్యకు తెలియకుండానే ఇలా ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారట. ఈ ఈవెంట్ పేరు చెప్పి విరాళాలను సేకరించబోతున్నట్లు నందమూరి బాలకృష్ణకు తెలిసింది. దీంతో వెంటనే స్పందించారు.. ఈ ఈవెంట్‌కు తనకు సంబంధం లేదంటూ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చారు. మరి అశ్విన్ అట్లూరి ఎవరు.. ఆయన ఎందుకు ఇలా ఈవెంట్ పేరుతో ప్రచారం చేస్తున్నారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.