తిరుమల శ్రీవారికి చాలా రోజుల తర్వాత భారీగా హుండీ ఆదాయం సమకూరింది. సోమవారం (28-07-2025) అత్యధికంగా రికార్డు స్థాయిలో రూ.5.44 కోట్ల హుండీ కానుకలు వచ్చాయని టీటీడీ తెలిపింది. ని సోమవారం 77,044 మంది భక్తులు దర్శించుకున్నారు.. 28,478మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జూన్ 30న అత్యధికంగా 5.30 కోట్లు హుండీ ఆదాయం వచ్చింది. టీటీడీ ప్రతి రోజూ ఎక్కువమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా ప్లాన్ చేసింది. ప్రతి రోజూ 70 వేల నుంచి 90 వేల వరకు రద్దీని బట్టి స్వామివారిని దర్శించుకుంటున్నారు. తిరుమలలో గరుడపంచమి'గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనసేవ ప్రారంభమైంది. శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాదీ గరుడ పంచమిని శుక్ల పక్షం ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడ పంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా, బలశాలిగా ఉండేందుకు చేస్తారు. గరుడ వాహనసేవలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, ఇత‌ర‌ అధికారులు పాల్గొన్నారు' అని టీటీడీ తెలిపింది.పట్టాభిషేక మహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణవాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు జులై 29 నుండి 31వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. జులై 29న సాయంత్రం 6 గంట‌ల‌కు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. జులై 30వ తేదీన ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 10 గంట‌ల‌కు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ, సాయంత్రం 6.30 గంటలకు శ్రీ సీతారాముల‌ శాంతి కళ్యాణం, రాత్రి 8 గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు. జులై 31న ఉదయం యాగశాల పూజ, ఉద‌యం 6.30 గంట‌ల‌కు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు. గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఈ మూడు రోజుల పాటు టీటీడీ హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి. శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం చాలా పురాతనమైనది. జాంబవంతుడు ఇక్కడ సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్ను, హనుమత్‌ సమేత శ్రీ పట్టాభిరామస్వామివారిని ప్రతిష్ఠించాడని ఇక్కడి స్థలపురాణం. ఈ ఆలయ ద్వారం ఉత్తర దిక్కుకు ఉన్నది. ఈ ఆలయం చోళుల శైలితో నిర్మించబడినది.