హైదరాబాద్ వాసులకు భారీ శుభవార్త.. ఆ ఏరియాలో ట్రాఫిక్ నరకానికి విముక్తి.. ఫ్లై ఓవర్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్..

Wait 5 sec.

హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు సిద్ధమైంది. న ట్రాఫిక్ చిక్కులను తొలగించడానికి , అండర్‌పాస్‌ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఈ నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ నుంచి అనుమతులు లభించాయి. పర్యావరణపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పనులను వేగవంతం చేసింది. సుమారు 826 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో భాగంగాలు, నాలుగు వరుసల ఫ్లైఓవర్లను నిర్మిస్తారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి క్యాన్సర్ ఆసుపత్రి వరకు.. అలాగే రోడ్డు నంబర్ 36 వైపు వెళ్లే మార్గాల్లో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి, తెలుగుదేశం పార్టీ కార్యాలయ పరిసరాల్లో రెండు చోట్ల ఈ పరీక్షలు పూర్తయ్యాయి. నిజానికి 2017లోనే ఒకసారి పరీక్షలు జరిగినప్పటికీ.. సుదీర్ఘ కాలం గడవడంతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మళ్లీ పరీక్షలు చేస్తున్నారు. రాబోయే రెండేళ్ల కాలంలో ఈ పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు దశల్లో పనులు నిర్వహించి.. పర్యావరణానికి తక్కువ హాని కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఈ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వస్తే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి మరియు కొండాపూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తప్పుతుంది. ఐటీ ఉద్యోగులు, వాణిజ్య సముదాయాలకు వెళ్లేవారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. నగర విస్తరణకు అనుగుణంగా ఇలాంటి ఆధునిక రహదారి వ్యవస్థలు రావడం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందుతుంది.