ఆ రైతులు ఒక్కొక్కరికి రూ.4000.. పీఎం కిసాన్ 22వ విడత అప్డేట్.. ఈ పని చేస్తేనే ఖాతాలోకి డబ్బులు

Wait 5 sec.

PM Kisan: దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) 22వ విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21వ విడత నిధులను నవంబర్ 2025లో రైతుల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. రబీ పంటల సాగు మొదలైపోయింది. చాలా ప్రాంతాల్లో వరి నాట్లు పూర్తవుతున్నాయి. అయితే, 22వ విడత నిధులు పొందాలంటే రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఖాతాల్లోకి డబ్బులు రాకపోవచ్చు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. కింద అర్హులైన రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా రూ. 6 వేల పంట పెట్టుబడి సాయం అందిస్తోంది. మూడు విడతల్లో రూ.2000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు అండగా నిలుస్తూ వారి ఆదాయం రెట్టింపు చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రతి విడతలో వేల కోట్ల రూపాయలు రైతులకు అందుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే 22వ విడత నిధులు విడుదల కానున్నాయి. ఫిబ్రవరి, 2026 నెలలో 22వ విడత విడుదలయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైపోయింది. ఇ-కేవైసీ పూర్తి చేసిన వారికేపీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు ఎలాంటి అంతరాయం లేకుండా రావాలంటే ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇ-కేవైసీ పెండింగ్‌లో ఉన్న రైతులకు 22వ విడత నిధులు ఆగిపోవచ్చు. రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లి ఓటీపీ ఆధారిత ప్రక్రియ ద్వారా ఇంటి నుంచే కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా కామన్ సర్వీస్ సెంటర్‌కి వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారానూ పూర్తి చేయవచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సైతం చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఆధార్ అనుసంధాన్ లేకపోయినా, డీబీటీ సేవలు యాక్టివ్ గా లేకున్నా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వీటితో పాటుగా దరఖాస్తు సమయంలో ఇచ్చిన భూమి వివరాలు సరిగ్గా లేకపోయినా నిధులు రావు. మీ పేరు మీద ఉన్న భూమి వివరాలను పోర్టల్ లో చెక్ చేసుకోవాలి. ఈ రైతులకు రూ.400021వ విడత సమయంలో కేవైసీ పూర్తి చేయలేదనే కారణంతో డబ్బులు రాని వారు, ల్యాండ్ రికార్డులు వెరిఫై పూర్తి చేయని వారు, బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ చేయకుండా సాయం అంటే 21వ విడత నిధులు రూ.2000, 22వ విడత రూ.2000 మొత్తం నాలుగు వేలు ఖాతాలో పడేందుకు అవకాశం ఉందని సమాచారం. అయితే, లబ్ధిదారుల జాబితాలో ఉండి కేవైసీ పూర్తి చేయని వారికి మాత్రమే ఇలా నాలుగు వేలు వస్తాయట. కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.