ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు నేటితో తెర పడబోతోంది. జనవరి 4, ఆదివారం ఉదయం 10.15 గంటలకు ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కరణ కానుంది. జిల్లా, భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆదివారం నాడు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, ఇతర అధికారులు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో భోగాపురం చేరుకుంటారు. తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 10.15 గంటలకు తొలి వాణిజ్య విమానం ట్రయల్ రన్‌గా రన్‌వే మీద దిగనుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే, విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ విమానాశ్రయం నిర్మాణం 96 శాతం పూర్తయిందని తెలిపారు.కూటమి ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో వచ్చిన భీకరమైన హుద్‌హుద్ వంటి తుపానులను తట్టుకునేలా దీన్ని పటిష్టంగా నిర్మించారు. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా ఈ విమానాశ్రయం చెక్కుచెదరదు. అంతే కాకుండా 27 సెంటీమీటర్ల వర్షం కురిసినా, ఎయిర్‌పోర్టులో ఎక్కడా నీరు నిలవకుండా బయటకు వెళ్లిపోయేలా అధునాతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలి దశలో ఈ ప్రాజెక్టు పనుల కోసం రూ. 4,725 కోట్లు ఖర్చు చేశారు. నేడు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా, ఈ సంవత్సరం జులై నుంచి ఈ విమానాశ్రయం నుంచి అధికారికంగా విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ఈ విమానాశ్రయం రోజుకు 200 విమానాలను నడిపే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం 20 వేల టన్నుల సరుకులను ఎగుమతి చేసే అవకాశం ఉంది.ఈ విమానాశ్రయంలో రాత్రి సమయంలో 18 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రయాణించే వారిలో 33 శాతం మంది విశాఖ నగరవాసులు కాగా, మిగిలిన 67 శాతం మందిలో ఉత్తరాంధ్ర వాసులతో పాటుగా పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మొత్తం 14 ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయానికి నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కూటమి ప్రభుత్వం 3 ప్రధాన రహదారులను సిద్ధం చేస్తోంది. విమానాశ్రయం టెర్మినల్ లోపల విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని, ఏటికొప్పాక కళాకృతులను ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా అలంకరణలు ఏర్పాటు చేస్తున్నారు.ఈ విమానాశ్రయంలో ఒకేసారి 300 విమానాలు దిగేలా సౌకర్యాలు కల్పించడం విశేషం. అంతర్జాతీయ బిడ్స్ ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించారు. ముఖ్యంగా, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్‌బస్ A380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను రూపొందించారు. తొలి దశలోనే ప్రతి ఏడాది 60 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే సామర్థ్యంతో టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు.డా సిద్ధంగా ఉన్నాయి.