వెనుజులా అయిపోయింది.. తర్వాత ఆ దేశాలే, ట్రంప్ వార్నింగ్..!

Wait 5 sec.

దక్షిణ అమెరికా దేశం జరిపింది అమెరికా. అనంతరం . మదురో చేతికి సంకెళ్లు వేసి, కళ్లకు గంతలు కట్టి అమెరికాకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో అమెరికా చర్యను పలు లాటిన్ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. దీనిపై స్పందించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశాలను కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇప్పడు వెనుజులా అయిపోయింది.. తర్వాత మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాల సంగతి చూస్తాం అని ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. అమెరికా ఆధీనంలో వెనుజులా.. నికోలస్ మదురోను విజయవంతంగా అధికారం నుంచి తొలగించామని ట్రంప్ ప్రకటించారు. తాత్కాలికంగా వెనుజులా అమెరికా ఆధీనంలో ఉంటుందని ట్రంప్ చెప్పారు. కాగా, ఒక స్వాతంత్ర్య, సార్వభౌమత్వం కలిగిన దేశాన్ని సైనిక చర్యతో కూలగొట్టాడాన్ని అమెరికా సమర్థించుకుంటోది. మదురో "నార్కో టెర్రరిజం" నెట్‌వర్క్‌కు నాయకత్వం వహిస్తున్నాడని ఆరోపిస్తోంది. ఈ నెట్‌వర్క్ అమెరికాను కొకైన్, ఫెంటానిల్‌ వంటి మాదకద్రవ్యాలతో నింపుతోందని, అమెరికన్ల జీవితాలను నాశనం చేస్తోందని ఆరోపిస్తోంది. వనరులను దోచుకునేందుకు అమెరికా దాడి.. కాగా, అమెరికా ఆరోపణలను వెనుజులా తీవ్రంగా ఖండించింది. సైనిక దురాక్రమణ వెనుక ఉన్న నిజమైన ఉద్దేశ్యం అదికాదని.. తమ దేశంలో ఉన్న చమురు, ఖనిజ వనరులను దోచుకోవడమేనని పేర్కొంది. మరోవైపు, అమెరికా దాడిని వెనుజులా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అత్యంత తీవ్రమైన పరిణామమంగా పేర్కొంది. వనరులు దోచుకోవడానికి దేశ రాజకీయ స్వాతంత్ర్యాన్ని బలవంతంగా దెబ్బతీసే ప్రయత్నమని ఆరోపించింది. కాగా, దేశ ఆపద్ధర్మ నేతగా ఉన్న వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్.. అమెరికా నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. తమ అధ్యక్షుడిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదురోకు తగిన శాస్తి..2025 సంవత్సరానికిగానూ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న వెనుజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో.. దాన్ని డోనాల్డ్ ట్రంప్‌కు అంకితం చేసిన సంగతి తెలిసిందే. మదురోను అమెరికా నిర్బంధించడాన్ని మరియా కొరినా సమర్థించారు. నికోలస్ మదురో అమెరికా బలగాలకు పట్టుబడిన తర్వాత వెనుజులాలో స్వేచ్ఛా గంట మోగిందన్నారు. శిక్ష అనుభవిస్తాడని పేర్కొన్నారు. మదురో నిర్బంధాన్ని లాటిన్ అమెరికా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయితే పశ్చిమ దేశాల నుంచి మాత్రం రియాక్షన్ వేరేలా ఉంది. వెనుజులాలో మదురో పాలన ముగిసినందుకు బ్రిటన్ కన్నీళ్లు కార్చదని యూకే ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు.