తొలి వందే భారత్ స్లీపర్ రైలు రెడీ.. ఆ మార్గంలోనే, టికెట్ ధర కూడా ఫిక్స్, ఎంతో తెలుసా?

Wait 5 sec.

సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ వెల్లడించారు. విమాన ప్రయాణానికి దీటైన వసతులు, అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లు, మధ్యతరగతికి అందుబాటులో ఉండే ధరలతో ఈ రైలును రూపొందించారు. మార్చబోతోంది.అందించనుంది. ఈ మార్గంలో టికెట్ ధరలను కూడా ఫిక్స్ చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. శనివారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఈ రైలు కోచ్‌లను స్వయంగా పరిశీలించిన అశ్విని వైష్ణవ్.. అందులోని అత్యాధునిక వసతులను మీడియాకు వివరించారు.మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు టికెట్ ధరలను నిర్ణయించినట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉండగా.. అందులో 823 బెర్త్‌లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ స్లీపర్ రైలులో అనేక వినూత్న మార్పులు చేశారు.వందే భారత్ స్లీపర్ రైలులో వసతులుఅత్యాధునిక ఇంటీరియర్అడ్జస్టబుల్ విండో షేడ్స్, రీడింగ్ లైట్స్, మ్యాగజైన్ హోల్డర్లు, విశాలమైన ట్రే హోల్డర్లు, నీరు బయటకు చిందకుండా ఉండేలా లోతైన వాష్ బేసిన్‌లను ఏర్పాటు చేశారు.మెరుగైన సౌకర్యంబెర్త్‌లకు నాణ్యమైన కుషనింగ్, శబ్దాన్ని తగ్గించే నాయిస్ రిడక్షన్ టెక్నాలజీ, మెరుగైన సస్పెన్షన్ వ్యవస్థను అమర్చారు.సెక్యూరిటీఆటోమేటిక్ డోర్లు, ఎమర్జెన్సీ సమయాల్లో మాట్లాడేందుకు టాక్ బ్యాక్ సిస్టమ్, రైలు ప్రమాదాలను నివారించే కవచ్ వ్యవస్థను ఈ వందే భారత్ స్లీపర్ రైలులో ఏర్పాటు చేశారు. ప్రత్యేక శ్రద్ధదృష్టి లోపం ఉన్నవారి కోసం సీటు నంబర్లను బ్రెయిలీ లిపిలో ముద్రించారు. అలాగే పరిశుభ్రత కోసం డిసిన్ఫెక్టెంట్ టెక్నాలజీని వాడుతున్నారు.టికెట్ ధరలు (ఆహారంతో కలిపి)3 AC టికెట్ ధర సుమారు రూ. 2,3002 AC టికెట్ ధర సుమారు రూ. 3,0001 AC టికెట్ ధర సుమారు రూ. 3,600