తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఈ వర్షాలు కురుస్తాయన్నారు. నేడు (బుధవారం) కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో పలుచోట్ల వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ముసురు పట్టింది. రాత్రి నుంచే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.1 సెం.మీ., మంచిర్యాల జిల్లా నస్పూర్‌ 8.4 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి 7.5 సెం.మీ., కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి 7.4 సెం.మీ., మంచిర్యాల జిల్లా భీమినిలో 7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ నగరం గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నగరంలోని అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. అల్లాగడ్డబావి, యూసుఫ్‌గూడ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట, బేగంపేట్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్, తార్నాక వంటి ప్రధాన జంక్షన్లలో నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పీక్ అవర్స్‌లో రోడ్లపైకి వచ్చిన వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉప్పల్, కూకట్‌పల్లి, దిల్సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్, హబ్సిగూడ, మలక్‌పేట్ వంటి ప్రాంతాల్లో మోకాలి లోతు నీళ్లు నిలిచిపోయాయి. కొన్ని చోట్ల ఓపెన్ మ్యాన్‌హోల్స్ ప్రమాదకరంగా మారాయి.పరిస్థితి తీవ్రత దృష్ట్యా, సైబరాబాద్ పోలీసులు ఐటీ, కార్పొరేట్ కంపెనీలకు వర్క్ ఫ్రం హోమ్ (WFH) ను అమలు చేయాలని సూచించారు. ఇది ట్రాఫిక్ రద్దీని తగ్గించి, అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా చూస్తుందని పేర్కొన్నారు. పౌరులు అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు రంగంలోకి దిగి వరదనీటిని తొలగించడానికి, ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి కృషి చేస్తున్నాయి. అయితే, ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు, ఇది ప్రజలకు మరిన్ని ఇబ్బందులను కలిగిస్తోంది.