ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటోంది. అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో పింఛన్లు పొందుతున్న 1.08 లక్షల మందికి ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వీరు సమర్పించిన బోగస్ సదరం సర్టిఫికెట్లను రద్దు చేయనున్నారు. అంతేకాదు, కూడా తొలగించనున్నారు. ప్రభుత్వం వైద్య బృందాలతో తనిఖీలు చేస్తోంది. వైకల్యం శాతం మారిన వారికి కొత్త సదరం సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ నెల 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయి. వీటిని లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తారు. కోసం 40 శాతం వైకల్యం ఉండాలని చెప్పింది. తనిఖీల్లో తక్కువ వైకల్యం ఉన్నవారికి అసెస్‌మెంట్ రిపోర్టు ఇస్తారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖకు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైద్యులు నిర్ధారించిన వైకల్యశాతంతో కూడిన సదరం ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉండనున్నాయి. ఉచితంగానే వీటిని లబ్ధిదారులకు అందించనున్నారని ప్రభుత్వం తెలిపింది. తనిఖీల్లో అర్హత లేని వారి పింఛన్లు రద్దు కానున్నాయి. అర్హులైన దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందుతాయి. ప్రత్యేక అధికారుల పాలన పొడిగింపుమరోవైపు రాష్ట్రంలోని పది పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు. ఎన్నికలు జరిగే వరకు ప్రత్యేక పాలన కొనసాగుతుందని పురపాలక శాఖ తెలిపింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమదాలవలస, నరసరావుపేట, పొన్నూరు, కందుకూరు, కావలి, వైఎస్సార్‌ తాడిగడప పురపాలక సంఘాల్లో ప్రత్యేక అధికారుల పదవీకాలం గతంలోనే ముగిసింది. అలాగే చింతలపూడి, పొదిలి, అల్లూరు, బి.కొత్తకోట నగర పంచాయతీల్లో కూడా ప్రత్యేక అధికారుల పదవీకాలం పూర్తయింది. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక పాలన కొనసాగుతుంది" అని పురపాలక శాఖ స్పష్టం చేసింది. గత రెండు నెలల్లో వివిధ తేదీల్లో పదవీకాలం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.