దళితబంధు చెక్కులు పంపిణీ చేసిన భట్టి విక్రమార్క.. అలా చేస్తే చర్యలు తప్పవంటూ..

Wait 5 sec.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభివృద్ధికి భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు . ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ.. తాము అధికారంలోకి వస్తే.. దళిత బంధు కింద 12 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. కానీ దీన్ని ఇంకా అమలు చేయలేదని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం దళితబంధు చెక్కులు పంపిణీ చేశారు. మధిర నియోజకవర్గంలోని మండలంలో దళితబంధు లబ్దిదారులకు రెండో విడతకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు.. తెలంగాణ డిప్యూటీ సీఎం . లబ్ధిదారులకు అందించాల్సిన రెండో విడతకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దళితబంధు లబ్ధిదారులందరికీ నిధుల పంపిణీ కొనసాగుతుందని గతంలో తాను ప్రకటించినట్టుగానే.. నేడు చెక్కుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. తాను సీఎల్పీ నేతగా ఉన్న సమయంలో దళితబంధు స్కీమ్ పైలెట్ ప్రాజెక్ట్‌గా చింతకాని మండలాన్ని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ఈక్రమంలో చింతకాని మండలంలోని మొత్తం 3,465 మంది లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. లబ్ధిదారులు తాము ఎంచుకున్న వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ.. దశల వారీగా పొందాల్సిన దళితబంధు నిధులను వినియోగించుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అలానే చింతకాని మండలంలో సుమారు 3,465 మంది దళితబంధు లబ్ధిదారులు ఉండగా.. వీరిలో 1,387 లబ్ధిదారులు వారు పొందిన యూనిట్లను అమ్మడం, దారి మళ్లించడం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అయితే.. ఇతరులు వాటిని కొనుగోలు చేయడం చట్ట ప్రకారం చెల్లుబాటు కాదని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క తెలిపారు. దారి మళ్లించిన యూనిట్ల వివరాలు ఇస్తే.. అధికారులు వాటిని విచారించి.. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం 247 మంది లబ్ధిదారుల గురించి పూర్తిగా విచారించిన తర్వతే.. రెండో విడత నిధులు పొందేందుకు వారు అర్హులని అధికారులు గుర్తించారని.. అందుకే వారికి చెక్కులు పంపిణీ చేస్తున్నామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చెక్కులు పొందిన లబ్ధిదారులు వృత్తి, వ్యాపారాలు చక్కగా నిర్వహించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. దళితబంధు లబ్ధి పొందిన వారు.. చక్కగా వ్యపారాలు నిర్వహించి మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.