ఏపీవాసులకు అలర్ట్.. బంగాళాఖాతంలో ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పలు జిల్లాలలో మోస్తారు నుంచి పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే మిగతా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడతాయని అంచనా వేశారు. పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు, చెట్ల కింద ఉండవద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో అల్పపీడనం..!మరోవైపు బంగాళాఖాతంలో ప్రస్తుతం ద్రోణి కొనసాగుతుండగా.. జూలై 24 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుమరోవైపు భారీ వర్షాలు కురిసే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షం పడే సమయంలో సురక్షిత ప్రదేశంలో ఉండాలి. వీలైతే బయటకు రాకుండా ఇంట్లో ఉండటం మంచిది. లోతట్టు ప్రాంతాలలో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లటం ఉత్తమం. గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలి. తడి చేతులతో ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ పరికరాలను తాకకూడదు. రహదారులపై నీరు నిలబడే ప్రాంతాలలో వాహనాలు నడపకూడదు. ఆహారం, టార్చ్, బ్యాటరీలు, నీరు వంటి వాటిని సిద్ధం చేసుకుని ఉండాలి. పిడుగులు పడే అవకాశం ఉంటే బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లైతే ఎత్తైన చెట్లు లేదా, కరెంట్ స్తంభాల వద్ద నిలబడకూడదు. భారీ వర్షాల సమయంలో ఏదైనా సహాయం అవసరమైతే సిబ్బందిని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.