SGB Gold Bonds: భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శుభకార్యాల నుంచి ఏదైనా ప్రారంభోత్సవాల వరకు.. పెట్టుబడి నుంచి ఆపద మొక్కుల వరకు పసిడిదే ప్రముఖ స్థానం. కానీ, భౌతిక బంగారం కొంటే భద్రతా సమస్యలు, తయారీ ఖర్చులు, స్వచ్ఛత గురించిన ఆందోళనలు తప్పవు. అందుకే చాలా మంది డిజిటల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అంటే ఇక్కడ బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. అది కూడా డిజిటల్ రూపంలో. ఇక్కడ ఎలాంటి భద్రతా సమస్యలు ఉండవు. ఇక ఇందుకోసం . ఈ బాండ్లు పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తున్నాయి. ప్రస్తుతానికి . అయినప్పటికీ గతంలో జారీ చేసిన బాండ్ల కాల పరిమితి ఇంకా ముగియలేదు కాబట్టి వాటిని కొనుగోలు చేసిన వారికి ఈ పథకం కొనసాగుతుందని చెప్పొచ్చు. . ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆర్బీఐ.. SGB 2018-19 సిరీస్-V ముందస్తు విమోచన ధరను ప్రకటించింది. ముందస్తు విమోచన ధర అంటే.. సాధారణంగా గోల్డ్ బాండ్ల కాల పరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అందుకే.. ఐదేళ్లు దాటిన తర్వాత కూడా ఆర్బీఐ ఈ గోల్డ్ బాండ్ ధరల్ని ప్రకటిస్తుంటుంది. ఈ 2018-19 సిరీస్- V ఇష్యూ సమయంలో బాండ్లను కొనుగోలు చేసిన వారికి బంపర్ రిటర్న్స్ వచ్చాయి. మూడింతల లాభం వచ్చిందని చెప్పొచ్చు. అప్పట్లో అంటే ఆరేళ్ల కిందట గోల్డ్ బాండ్ ఇష్యూ ధర రూ. 3,214 గా ప్రకటించింది. అంటే గ్రాము ధర రూ. 3214. కానీ ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో రూ. 3,164 కే గ్రాము బంగారం వచ్చిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు గోల్డ్ రేటు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అదే గోల్డ్ బాండ్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన ప్రైస్‌ను రూ. 9,820 గా ప్రకటించింది. అంటే ఇక్కడ గ్రాముపైనే రూ. 9820- 3164= రూ. 6,656 లాభం వచ్చిందని చెప్పొచ్చు. ఇంకా వడ్డీ అదనం. గోల్డ్ బాండ్ల జారీ సమయంలో 2.50 శాతం వడ్డీ రేటు ప్రకటించింది. రూ. లక్షకు ఎంతొచ్చింది?ఇక ఇష్యూ ధర రూ. 3,164 చొప్పున రూ. లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్పుడు 31.60 గ్రాముల బంగారం లభించేది. ఇక ప్రస్తుతం రిడెంప్షన్ ప్రైస్ రూ. 9820 గా ఉండగా.. ఆ మొత్తం 31.60x9820= రూ. 3,10,366 అయింది. అంటే రూ. లక్ష పెట్టుబడిపై రూ. 3.10 లక్షలు వచ్చాయి. మూడింతల లాభం వచ్చిందన్నమాట. ఇంకా వడ్డీ లాభం అదనం అని చెప్పొచ్చు. ఇక్కడ రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి అదనంగా రూ. 2.10 లక్షలపైనే లాబం వచ్చిందని చెప్పొచ్చు. అంటే భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయకుండానే.. బంగారంపై పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పించే ప్రభుత్వ సెక్యూరిటీలు. మీరు బాండ్లను కొనుగోలు చేసేటప్పుడు డబ్బు రూపంలో చెల్లిస్తారు. మెచ్యూరిటీ సమయంలో తిరిగి డబ్బు రూపంలోనే పొందుతారని చెప్పొచ్చు. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ గోల్డ్ బాండ్లు జారీ చేస్తుంది కాబట్టి ఇవి సురక్షితమైనవిగా చెప్పొచ్చు.