: తీసుకుంది. కృత్తిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ద్వారా బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనుంది. ఈ విషయాన్ని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. ఇందుకోసం త్వరలోనే యాప్ రూపొందించనున్నామని తెలిపారు. ఏఐతో బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ ద్వారా జవాబుదారీతనం మరింత పెరగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ట్రైనింగ్ పూర్తైన చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆగస్ట్ 30లోగా హాస్టళ్లకు మంజూరైన మరుగుదొడ్లు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. బీసీ హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. హాస్టళ్లల్లో అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని.. ఆగస్ట్ 5వ తేదీలోగా అడ్మిషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.ఇక ఫేషియల్‌ రికగ్నైషన్‌ బేస్డ్‌ అటెండెన్స్‌ సిస్టమ్‌ - ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా విద్యార్థుల హాజరులో ఇబ్బందులు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని మంత్రి సవిత సూచించారు. బీసీ హాస్టళ్ల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన డైట్ బిల్లుల బకాయిలు చెల్లించడమే కాకుండా, ఎప్పటికప్పుడు డైట్ బిల్లులు చెల్లిస్తున్నట్లు వివరించారు. రాత్రివేళల్లో హెచ్ డబ్ల్యూవోలు హాస్టళ్లలోనే ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. అధికారులు కూడా తరుచూ హాస్టళ్లను సందర్శించాలని, వీలైతే రాత్రి బస కూడా చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం టూర్ డైరీ రూపొందించటమే కాకుండా, ఆ డైరీని ప్రతి నెలా అయిదో తేదీలోగా రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా బీసీ హాస్టళ్లలో మరమ్మతులు చేపట్టామన్న మంత్రి.. ఇందుకోసం రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులతో హాస్టళ్లలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఆగస్టు 30వ తేదీ నాటికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని బీసీ హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. హాస్టళ్ల జవాబుదారీతనం మరింత పెంచేలా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తామని.. దీని ద్వారా మెనూ అమలు, పరిశుభ్రత పర్యవేక్షణ, విద్యార్థులు, సిబ్బంది హాజరు వంటి అంశాలను పర్యవేక్షిస్తామని మంత్రి వివరించారు. అలాగే బీసీ హాస్టళ్ల అభివృద్ధికి పీ4 మోడల్ అమలు చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. మార్గదర్శకులను గుర్తించి, బీసీ హాస్టళ్లను దత్తత ఇస్తామని వెల్లడించారు. మరోవైపు బీసీ సామాజికవర్గంలోని కులవృత్తిదారుల కోసం ఉద్దేశించిన ఆదరణ పథకంపై మంత్రి కీలక విషయాలు వెల్లడించారు. ఆదరణ 3.0 పథకం కింద లబ్ధిదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరికరాలను ఇస్తామన్న మంత్రి సవిత.. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1000 కోట్లు మంజూరు చేసిందన్నారు. అలాగే విజయవంతమైందని.. త్వరలోనే మహిళలకు కుట్టు మిషన్లు అందజేయనున్నట్లు ప్రకటించారు. కుట్టు మిషన్లు ఇవ్వటం మాత్రమే కాకుండా, వారు తయారు చేసే దుస్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని బీసీ కార్పొరేషన్ అధికారులను మంత్రి సవిత ఆదేశించారు.