వీరమల్లు టికెట్ రేట్లు పెంపు.. ఏపీ డిప్యూటీ సీఎం సార్ రేంజ్‌కి తగ్గట్టే ఉన్నాయ్‌గా!

Wait 5 sec.

రెండేళ్ల తర్వాత నుంచి రాబోతున్న సినిమా ‘’. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ హిస్టారికల్ యాక్షన్‌ మూవీ మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందని సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. ఇదంటుంచితే డిప్యూటీ సీఎం సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ‘హరి హర వీరమల్లు’ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని, జులై 24న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం స్పెషల్ జీవో జారీ చేసింది. సినిమా రిలీజైన తర్వాత మొదటి రెండు వారాలపాటు ధరలు పెంచుకోడానికి అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత గవర్నమెంట్ ని కోరారు. కానీ మొదటి 10 రోజులు మాత్రమే రేట్లు పెంచడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా ‘హరి హర వీరమల్లు’ సినిమా రిలీజయ్యే సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో టికెట్‌పై లోయర్‌ క్లాస్ కు రూ.100, అప్పర్‌ క్లాస్‌ కు రూ.150 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.200 వరకు ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. 23వ తేదీన పెయిడ్ ప్రీమియర్స్ కి రూ.600 టికెట్ రేట్లు పెంచుతున్నారు. దీనికి జీఎస్టీ అదనంగా ఉంటుంది. ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. సినిమా రిలీజైన 10 రోజుల తర్వాత సాధారణ టికెట్ ధరలతో సినిమా టికెట్లు విక్రయించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణలో టికెట్‌ రేట్లు పెంచుకోడానికి పర్మిషన్ కోరుతూ ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఏఎం రత్నం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికైతే దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రంతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ స్టోరీతో రూపొందిన సినిమా కావడంతో, టికెట్ రేట్స్ హైక్ కి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే నైజాంలో పవన్ కళ్యాణ్ సినిమాకి భారీ ఓపెనింగ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది.‘హరిహర వీరమల్లు’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఇది ఫిక్షనల్ కథతో రూపొందించిన హిస్టారికల్ మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఓవర్సీస్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా.. 9 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లుగా మేకర్స్ తెలిపారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు.