తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని . వైద్య ఆరోగ్యశాఖ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక సూచనలు జారీ చేసింది సమస్యలు, ముఖ్యంగా అంటువ్యాధుల వ్యాప్తిని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది.దోమల నియంత్రణ..వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుందని.. ఇది డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులకు కారణమవుతుందని వైద్య శాఖ హెచ్చరించింది. దీని నివారణకు ప్రజలు తమ నివాస ప్రాంతాల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి తలుపులు, కిటికీలకు దోమ తెరలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా దోమలు లోపలికి రాకుండా చూసుకోవచ్చు. సెప్టిక్ ట్యాంకులు, దోమలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో మెష్‌లను వాడి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది.ఆహారం, నీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య శాఖ పేర్కొంది. వడకాచిన నీటిని మాత్రమే తాగాలని.. భోజనానికి ముందు, తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. బయట లభించే ఆహార పదార్థాలను, ముఖ్యంగా వీధి చిరుతిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని హెచ్చరించింది. ఇవి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.అంటువ్యాధుల నివారణ..వర్షాకాలంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు సాధారణం. అయితే, ఇవి తీవ్రమైన అంటువ్యాధుల లక్షణాలు కూడా కావచ్చు కాబట్టి, ఎవరైనా ఇలాంటి లక్షణాలతో బాధపడితే వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రిలో చేరి వైద్య సహాయం తీసుకోవాలని వైద్య శాఖ కోరింది. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులతో కరచాలనం (హ్యాండ్‌షేక్) వీలైనంతగా తగ్గించాలని.. శానిటైజర్‌ను ఉపయోగించడం ద్వారా చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది.రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని.. అర్హులైన వైద్య సిబ్బంది ప్రజలకు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రభుత్వ సూచనలను పాటించి, వర్షాకాలాన్ని సురక్షితంగా గడపాలని విజ్ఞప్తి చేసింది.