ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం పథకాన్ని అమలు చేస్తోంది.. ప్రతి ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరంలో కింద ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం నమోదు చేసుకోవడానికి ఈ నెలాఖరు చివరి తేదీ. ఇప్పటికే ఈ పథకం కింద ప్రభుత్వం మొదటి విడతగా ఇప్పటికే నిధులు విడుదల చేసింది. సిలిండర్ బుక్ చేసుకున్న 48 గంటల్లో డబ్బులు బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. ఒకవేళ డబ్బులు జమకాకపోతే ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ఏమైనా సమస్యలు వస్తే, పౌరసరఫరాల శాఖ, గ్యాస్ ఏజెన్సీలు వెంటనే పరిష్కరిస్తాయి.ఎవరికైనా గ్యాస్ రాయితీ డబ్బులు జమ కాకపోతే టోల్‌ఫ్రీ నంబర్ 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ముందుగా గ్యాస్ ఏజెన్సీని కలిసి ఈకేవైసీ చేయించుకోవాలి.. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేయించుకోవాలి. అప్పుడు రాయితీ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. కింద మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకోవడానికి అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అధికారులు.ఇటీవల ఏపీ ప్రభుత్వం దీపం పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది.. కొత్త మార్పులు చేసింది. లబ్ధిదారులకు రాయితీ డబ్బులు నేరుగా అందేలా చూస్తోంది. ప్రస్తుతం ఇది ఒక గ్యాస్ ఏజెన్సీ పరిధిలో మొదలైంది. .ఇది విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తారు. దీని ద్వారా రాయితీ సొమ్ము నేరుగా లబ్ధిదారుల వ్యాలెట్‌కు చేరుతుంది. దీపం పథకం లబ్ధిదారుల ఫోన్‌లో ఒక బ్యాంకు యాప్ (app)ను ఇన్‌స్టాల్ చేస్తున్నారు. ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ రాయితీ డబ్బును ఆ వ్యాలెట్‌లోకి పంపుతుంది. గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు ఏజెన్సీ బిల్లుపై ఉన్న క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా గ్యాస్ ఏజెన్సీకి వెళ్తాయి.ఇంతకుముందు వినియోగదారులు మొదట డబ్బులు కట్టేవారు. ఆ తర్వాత ప్రభుత్వం రాయితీ డబ్బును వారి ఖాతాలో వేసేది. ఇప్పుడు లబ్ధిదారులకు నేరుగా రాయితీ చెల్లించేలా కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ కొత్త విధానం ప్రజలకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు.