Israeli PM : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనారోగ్యం కారణంగా స్వల్ప విరామం తీసుకున్నారు. పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఆయన డీహైడ్రేషన్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూనే.. దేశ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ సంఘటన ఆయన ఆరోగ్యంపై మరోసారి చర్చకు దారి తీసింది.తాజా సమాచారం ప్రకారం.. నెతన్యాహు పేగులలో వాపు (Intestinal Inflammation) తో బాధ పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీనికి కారణం ఆయన అపరిశుభ్రమైన లేదా వెల్లడించారు. శరీరంలో ద్రవాలు కోల్పోవడంతో.. ఆయనకు ఇంట్రావీనస్ (IV) ద్రవాలు ఎక్కిస్తున్నారు. వైద్యులు ఆయనకు మూడు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించగా.. ఆయన తన నివాసం నుంచే చూసుకుంటారని ఆయన కార్యాలయం స్పష్టం చేసింది.ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలు..నెతన్యాహుకు గతంలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి. ఆయనకు జరిగాయి. అంతేకాకుండా ఇటీవలే ఆయనకు పేస్‌మేకర్ (గుండెకు కృత్రిమ లయను అందించే పరికరం) అమర్చారు. ఈ వరుస ఆరోగ్య సమస్యల నేపథ్యంలో.. తాజా అనారోగ్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ప్రధానులు తమ వార్షిక ఆరోగ్య నివేదికలను విడుదల చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ.. నెతన్యాహు 2016 నుంచి 2023 వరకు అలాంటి నివేదికలను విడుదల చేయలేదు. ఈ సంవత్సరం కూడా ఎటువంటి నివేదిక విడుదల కాలేదు. అయితే ఈ నిబంధనలు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాల్సినవి కావని కూడా ఆయన కార్యాలయం పేర్కొంది.నెతన్యాహు త్వరగా కోలుకోవాలని పలువురు ప్రపంచ నాయకులు, దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంక్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వం వహిస్తున్న నెతన్యాహు ఆరోగ్యం దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో ఆయన త్వరగా పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి విధుల్లోకి రావాలని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు.