UPI Payments: భారత్‌లో డిజిటల్ చెల్లింపుల విప్లవం అనూహ్య వేగంతో దూసుకెళ్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇలాంటి చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. నేడు మన దేశంలో నెలనెలా 1800 కోట్లకుపైగా (18 బిలియన్లకు పైగా) జరుగుతున్నాయని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ సంవత్సరం ఒక్క జూన్ నెలలోనే చూస్తే.. అయ్యాయి. ఇంకా ఆ నెలలో 18.39 బిలియన్ల లావాదేవీలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో 13.88 బిలియన్ల లావాదేవీలు మాత్రమే జరిగాయి. అంటే, ఏడాది వ్యవధిలోనే ఏకంగా 32 శాతం వృద్ధి నమోదైందన్నమాట. ప్రస్తుతం 49.1 కోట్ల మంది సామాన్య ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు ఈ యూపీఐ సేవల్ని వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 675 బ్యాంకులు యూపీఐ పరిధిలోకి వచ్చాయి.గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారత్!ప్రస్తుతం దేశంలో మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 85 శాతం ఈ యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. ప్రపంచంలో రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 50 శాతం ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నట్లు ఐఎంఎఫ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇది యూపీఐ సాధించిన అద్భుత విజయాన్ని తెలియజేస్తుంది.భారత్‌తో పాటు యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి 7 దేశాల్లో యూపీఐ సేవలను అనుమతిస్తున్నారు. ఈ జాబితాను మరింత విస్తరించాలని.. ముఖ్యంగా బ్రిక్స్ సభ్యత్వ దేశాలకు యూపీఐని విస్తరించాలని రిజర్వు బ్యాంక్ యోచిస్తోంది. సురక్షితమైన, వేగవంతమైన లావాదేవీల వల్ల ప్రజల్లో ఇంత ఆదరణ పొందాయి.2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రారంభించిన ఈ యూపీఐ ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లింది. అప్పటినుంచి క్రమంగా యూపీఐ వాడకం పెరుగుతూ వస్తోంది. "భారత్‌లో ఇప్పుడు నగదు, కార్డు ఆధారిత చెల్లింపులతో పోలిస్తే డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లక్షలాది ప్రజలు, చిన్న వ్యాపారులు దీనిపైనే ఆధారపడుతున్నారు." అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) యూపీఐ ద్వారా చేసే చెల్లింపులకు అన్ని బ్యాంకులూ ప్రస్తుతం రూ. 1 లక్ష వరకే అనుమతి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్స్ వృద్ధి.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చడమే కాకుండా.. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని చెప్పొచ్చు.