ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ .. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ ఫస్టు బ్యాటింగ్ చేయనుంది. అన్షుల్ కాంబోజ్.. టెస్ట్ అరంగేట్రం చేశాడు.* ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ద్వారా.. సాయి సుదర్శన్ టెస్ట్ డెబ్యూ చేశాడు. కానీ ఆ తర్వాత రెండు మ్యాచ్‌లలో అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. వరుసగా మూడు మ్యాచ్‌లలో అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్.. ఆశించిన మేర రాణించలేకపోయాడు. దీంతో అతడి ప్లేసులో సాయి సుదర్శన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇక ఆకాశ్ దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలు ఈ మ్యాచ్‌కు దూరం కాగా.. వారి ప్లేసులో అన్షుల్ కాంబోజ్, శార్దుల్ ఠాకూర్ తుది జట్టులోకి వచ్చారు. అన్షుల్ కాంబోజ్‌కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.ప్రస్తుతం మాంచెస్టర్‌లో ఆకాశం మేఘావృతమై ఉంది. అందువల్లే తాము బౌలింగ్ చేయాలని అనుకుంటున్నట్లు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్స స్టోక్స్ చెప్పాడు. గాయపడ్డ షోయబ్ బషీర్ ప్లేసులో ఇంగ్లాండ్‌.. లియామ్ డాసన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 1-2తో వెనకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే.. సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది.తుది జట్లు..భారత్‌:యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్‌), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, అన్షుల్ కాంబోజ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌ఇంగ్లాండ్‌: జాక్ క్రాలీ, బెన్ డకెట్, జో రూట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జెమీ స్మిత్, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్