తిరుమల శ్రీవారి సేవకు ఆ పాలు మాత్రమే వాడాలని.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

తిరుమలలో శ్రీవారి సేవకు దేశీ ఆవుల పాలనే వాడాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తిరుమల శ్రీవారి సేవలో కేవలం స్వదేశీ ఆవుల పాలు, నెయ్యి మాత్రమే వాడాలని యుగతులసి ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. యుగతులసి ఫౌండేషన్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపేందుకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం నిరాకరించింది. చేసే సేవలో ఆవుల జాతి చూడటం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇంకా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయని కోర్టు తెలిపింది. జంతువులకు సేవ చేయడమే దేవుడికి మనం చేసే నిజమైన సేవ అని జస్టిస్ సుందరేష్ అన్నారు.ఆవు ఏదైనా ఆవే కదా అని వ్యాఖ్యానించారు.మరోవైపు పిటిషన్ వేసిన యుగతులసి ఫౌండేషన్ తరఫు లాయర్ కోర్టులో వాదనలు వినిపించారు. ఆగమశాస్త్రం ప్రకారం దేశీ ఆవులకు ప్రాముఖ్యత ఉందన్నారు. మనుషుల మధ్యే భాష, ప్రాంతం, కులం, మతం వంటి తేడాలు ఉంటాయన్నారు జస్టిస్ సుందరేష్. 'దేవుడు అందరికీ ఒక్కటేనని.. అది ప్రాణులైనా, ఇంకెవరైనా.. అయినా మనకున్న భక్తికి చిహ్నం మాత్రమే' అన్నారు. దేశీ ఆవుల పాలనే వాడాలనే వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అలా చెప్పడానికి చట్టంలో ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. గతంలో రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చిన తీర్పులను లాయర్ గర్తు చేయగా.. 'అలాగైతే మీరు ఇకపై తిరుపతి లడ్డూ కూడా దేశీయంగానే ఉండాలి' అంటారా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లాయర్ కోరగా..ధర్మాసనం అంగీకరించింది. కాకపోతే పిటిషనర్‌ హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణతిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమ‌వారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహ వచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులు, కౌతుకమూర్తులు, స్నపనమూర్తులకు బలిమూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అదే విధంగా విష్వక్సేన, ద్వారపాలకులు, భాష్యకార్లు, గరుడాళ్వార్‌, యాగశాలలోని హోమగుండాలు, బలిపీఠం ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆ తరువాత యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపడతారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, ఏఈవో ర‌వి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.