తెలంగాణ ప్రభుత్వం పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద మహిళలు రాష్ట్రంలోని ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం సిటీ ఆర్డీనరీ, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో భారీగా డిమాండ్ పెరిగింది. గతంలో సగటు ఆక్యుపెన్సీ రేషియో (సీట్ల భర్తీ నిష్పత్తి) సుమారు 67 శాతం ఉండగా, ఇప్పుడు ఇది 95%కు చేరింది. ముఖ్యంగా ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అయితే 110 శాతం దాటుతోంది. సీట్లు పూర్తిగా భర్తీ కావటమే కాకుండా.. నిలబడి ప్రయాణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే కాలు పెట్టేందుకు కూడా స్థలం ఉండట్లేదు. దీంతో వృద్ధులు, బాలింతలు, వికలాంగులు, గర్బిణీలు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల నుంచి కొత్త బస్సుల కోసం ఆర్టీసీకి పెద్ద ఎత్తున విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రయాణికులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి కూడా అభ్యర్థనలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సులు మొదటి రెండు, మూడు గ్రామాల్లోనే పూర్తిగా నిండిపోతున్నాయి. దీంతో మార్గమధ్యంలో ఉన్న గ్రామాలకు చెందిన ప్రయాణికులకు కనీసం నిలబడేందుకు కూడా చోటు దొరకడం లేదు.ఈ సమస్యను అధిగమించడానికి తెలంగాణ ఆర్టీసీ ఈ ఏడాది రూ.193.44 కోట్ల వ్యయంతో 503 చేయడానికి సిద్ధమవుతోంది. ఈ కొత్త బస్సుల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు తిరిగే పల్లెవెలుగు (ఆర్డినరీ), ఎక్స్‌ప్రెస్ బస్సులతోపాటు, హైదరాబాద్, వరంగల్ నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల సంఖ్యను పెంచడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చర్యల ద్వారా ప్రయాణికుల రద్దీని తగ్గించి, మెరుగైన రవాణా సేవలను అందించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు వెళ్లేందుకు మెరుగైన సౌకర్యం కలుగుతుంది. ఇక నుంచి నిలబడి ప్రయాణం చేసే ఇబ్బందులు లేకుండా హాయిగా కూర్చొని ప్రయాణం చేసే వీలు కలగనుంది.