సింగపూర్‌కు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.. మెయిన్ టార్గెట్ అదే!

Wait 5 sec.

CM : ఏపీకు వెళ్లనున్నారు. ఆదివారం నుంచి ఐదురోజుల పాటు సాగనుంది. ఈ నేపథ్యంలో షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. జూలై 26 (శనివారం) రాత్రి 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ పర్యటనకు బయల్దేరి వెళ్తారు. 27వ తేదీ ఉదయం ఆరింటికి.. సింగపూర్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటుగా మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, నారాయణ, ఇతర అధికారులు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు. సింగపూర్ పర్యటనలో బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌తో పెట్టుబడులు ఆకర్షించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు పలువురు వ్యాపారవేత్తలు, పలు సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. జూన్ 27వ తేదీ సింగపూర్ తెలుగు డయాస్పోరా ఫ్రం సౌత్ ఈస్ట్ ఏషియా అనే కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో సింగపూర్‌తో పాటు పలుదేశాలకు చెందిన తెలుగు పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడుదారులు హాజరుకానున్నారు. అనంతరం సింగపూర్‌లోని వన్‌వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూలులో AP NRT ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.మరోవైపు చంద్రబాబు సింగపూర్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై చర్చించనున్నారు. ఈ క్రమంలోనే విదేశాల్లో స్థిరపడిన తెలుగువారిని భాగస్వాములు చేసే అంశాలపై సమావేశాలలో చంద్రబాబు మాట్లాడనున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఎన్ఆర్ఐలను, తెలుగు వ్యాపారవేత్తలను చంద్రబాబు కోరనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలపైనా చర్చించనున్నారు.మరోవైపుఇప్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఐలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని సంకల్పించింది. సమాజంలోని పదిశాతం సంపన్న వర్గాలు.. అట్టడగున ఉన్న 20 శాతం నిరుపేద వర్గాలకు అండగా నిలిస్తే పేదరికాన్ని నిర్మూలించవచ్చనేదే ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.