వారిని తక్షణమే ఇళ్ల నుంచి ఖాళీ చేయించండి.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Wait 5 sec.

గత పది రోజుల క్రితం తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ తర్వాత కాస్త విరామం ఇచ్చిన వరుణుడు.. మళ్లీ విరుచుకుపడుతున్నాడు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంపై కుండపోత వర్షం పడటంతో సాధారణ జీవనం పూర్తిగా దెబ్బతింది. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారులు చెరువులను తలపించగా, ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. అధికారులు, పోలీసులు వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత శాఖలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రతి అధికారిని అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాతన ఇళ్లల్లో నివసించే కుటుంబాలను వెంటనే గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అలాగే కాజ్‌వేలు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ప్రవాహాన్ని అడ్డుకునే నిర్మాణాలను తొలగించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇరిగేషన్ విభాగం జలాశయాల నీటి మట్టాలను నిత్యం పరిశీలించి అవసరమైతే గేట్లను ఎత్తివేయాలని చెప్పారు. మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ కేవలం మూడున్నర గంటల్లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. రాజీపల్లి, పాతూర్ ప్రాంతాల్లో కూడా 8–9 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. గాంధీనగర్ కాలనీలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు వెంటనే జేసీబీలను ఉపయోగించి నీటిని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు చెరువులను తలపించడంతో రాకపోకలు కష్టతరమయ్యాయి. వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించింది. కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పంటల సంరక్షణలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. పాత భవనాలు కూలిపోవచ్చని అంచనాతో వాటిని ముందుగానే ఖాళీ చేయడం అవసరం. రహదారులపై విద్యుత్ తీగలు తెగిపోతే వాటిని తాకరాదని హెచ్చరిస్తున్నారు. వర్షాల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచించారు. ప్రభుత్వం ఇప్పటికే అర్బన్ డెవలప్‌మెంట్,, హెల్త్ వంటి శాఖలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని, ఎమర్జెన్సీ కంట్రోల్ రూములు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేసింది. ఈ చర్యల ద్వారా వర్షాల ప్రభావాన్ని తగ్గించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.