ఏపీలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీ.. ఆ 12 జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్‌ఫర్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరోసారిచేసింది. మొత్తం 12 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా కీర్తి చేకూరు, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా, ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా రాజాబాబు, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్‌గా రామసుందర్ రెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా, నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా, అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా నిషాంత్ కుమార్, కర్నూలు జిల్లా కలెక్టర్‌గా సిరి, అనంతపురం జిల్లా కలెక్టర్‌గా ఆనంద్, సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా శ్యామ్ ప్రసాద్, బాపట్ల జిల్లా కలెక్టర్‌గా వినోద్ కుమార్‌లను నియమిస్తూ గురువారం సాయంత్రం (సెప్టెంబరు 11న) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.మూడు రోజుల కిందటే ప్రభుత్వం 11 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. నియమించింది. టీటీడీ ఈవోగా సింఘాల్‌కు రెండోసారి అవకాశం ఇచ్చింది. టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, రహదారులు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా కృష్ణబాబును నియమించారు. ఏపీ రెవెన్యూ, ఎక్సైజ్‌ సెక్రటరీగా ముఖేశ్‌కుమార్‌ మీనా, అటవీ, పర్యావరణశాఖ సెక్రెటరీగా కాంతిలాల్‌ దండే, పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు నియమితులయ్యారు. కుటుంబ సంక్షేమశాఖ సెక్రెటరీగా సౌరభ్‌ గౌర్‌, గవర్నర్‌ స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా అనంతరామ్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌ల‌ను నియమించారు. రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌కు బాధ్యతలు అప్పగించింది.ఇక, గత కొద్ది రోజుల నుంచి జరిపింది. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయనే బదిలీల స్వయంగా పర్యవేక్షించడం గమనార్హం. గతేడాది ఎన్నికల్లో కూటమి గెలిచి, అధికారం చేపట్టిన తర్వాత జులై 2024లో 62 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో సివిల్ సర్వీస్ అధికారుల బదిలీ ఇదే.