ఏపీలో వారందరికి శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ఉచితంగా అకౌంట్లకు జమ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టులకు బంపరాఫర్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మావోయిస్టులు లొంగిపోగా.. వారికి తక్షణ సాయంగా రూ.11.20 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఒక్కొక్కరికి రూ.20 వేలు ఇస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లొంగిపోయిన 56 మంది మావోయిస్టుల జాబితాను కూడా ఉత్తర్వులతో పాటు విడుదల చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రమాదకర కార్యకలాపాలకు పాల్పడే వారిని నియంత్రించడానికి కలెక్టర్లకు ఉన్న పీడీ యాక్టు అధికారాలను ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. దోపిడీ దొంగలు, భూకబ్జాదారులు, డ్రగ్స్ నేరగాళ్లు, గూండాలను కట్టడి చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.ఏపీ ప్రభుత్వం అప్డేట్స్ఎక్సైజ్ శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ కమిషనర్, ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ, డిస్టిలరీస్ అండ్ బ్రూవరీస్ కమిషనర్‌గా ఆయన ఇకపై పూర్తి బాధ్యతలు నిర్వహిస్తారు. నిషాంత్‌కుమార్ బదిలీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. నిషాంత్‌కుమార్ అన్నమయ్య జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాహుల్‌దేవ్ శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్‌దేవ్ శర్మ ఇకపై ఈ మూడు పోస్టుల బాధ్యతలను కూడా చూసుకుంటారు.ప్రభుత్వ శాఖలు ఏప్రిల్ నుండి జూన్ వరకు వాడిన విద్యుత్ బిల్లుల కోసం రూ. 74.70 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. AP విద్యుత్ సమన్వయ కమిటీ ప్రతిపాదన మేర‌కు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ వరకు విద్యుత్ వినియోగించాయి. దీనికి ఛార్జీల కింద రూ.74.70 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో నీటి మట్టాలను ఆటోమేటిక్‌గా నమోదు చేసేందుకు 28 యంత్రాలు ఏర్పాటు కానున్నాయి. దీనికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. అలాగే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డిజిటల్ హెల్త్ నెర్వ్ సెంటర్ కోసం రూ.5.34 కోట్లు కేటాయించారు. కుప్పం నియోజకవర్గానికి అదనపు నిధులు కేటాయింపుతో డిజిటల్ హెల్త్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఈ నిధులను 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం మంజూరు చేసింది. పశువుల ఆరోగ్యం కాపాడటానికి ప్రభుత్వం రూ.4.94 కోట్లు విడుదల చేసింది. పశువులకు వచ్చే రోగాలను అరికట్టడానికి ఈ డబ్బును కేంద్రం సహాయంతో ఇస్తున్నారు. కేంద్రం ‘పశు వ్యాధుల నియంత్రణ కోసం రాష్ట్రాలకు సాయం(ఏఎస్‌సీఏడి)’ అనే పథకం కింద ఈ డబ్బును ఇస్తోంది. ఈ డబ్బును పశువుల ఆరోగ్య సంరక్షణ కోసమే వాడాలి. వేరే పథకాలకు మళ్లించకూడదని పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.