భారీగా తగ్గిన కార్ల ధరలు.. SBI, HDFC లో రూ. 5 లక్షల కార్ లోన్‌పై నెలకు EMI ఎంత?

Wait 5 sec.

GST on Cars: చాలా మంది దీపావళి పండగ సీజన్‌లో.. కొత్త బైక్, కారు వంటివి కొనుగోలు చేయాలని చూస్తుంటారు. కొన్ని వర్గాల వారికి కారు కొనడం అనేది ఒక లక్ష్యం అయితే.. మరికొందరికి ఇది అవసరం. ఇక ప్రస్తుతం మార్కెట్లో పలు రకాల కార్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లో కనీసం రూ. 5 లక్షల నుంచి ఎంట్రీ లెవెల్ కార్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా పండగల సమయాల్లో కార్ల తయారీ కంపెనీలు ప్రత్యేక డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తుంటాయి. ఇక కారు కొనాలనుకున్నవారు చాలా వరకు లోన్ తీసుకుంటుంటారు. బ్యాంకులు కూడా ఒకప్పటితో పోలిస్తే విరివిగా లోన్స్ ఇవ్వడం వల్ల వీటిని కొనేవారి సంఖ్యా పెరుగుతోంది. అయితే కార్ కొనాలనుకునే వారికి ఇప్పుడు మంచి టైమ్ అని చెప్పొచ్చు. . దీంతో కార్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి. కనీసం రూ. 60 వేలకుపైనే కార్లపై ధరల తగ్గింపు ప్రకటించాయి. ఇందులో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, స్కోడా,రెనాల్టీ, బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, హ్యుందాయ్, మారుతీ సుజుకీ ఇలా చాలానే ఉన్నాయి.>> ఇక సిబిల్ స్కోరు ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. 750 అంతకంటే ఎక్కువ సిబిల్ ఉంటే బ్యాంకులు ఇంకాస్త తక్కువ వడ్డీకే లోన్లు మంజూరు చేస్తుంటాయి. ఇక్కడ ప్రారంభ రేటుకే లభించొచ్చు. టెన్యూర్ గరిష్టంగా 7 సంవత్సరాల వరకు ఉంటుంది. సాధారణంగా కార్ ఆన్ రోడ్ ప్రైస్‌పై 80-90 శాతం వరకు బ్యాంకులు లోన్స్ ఇస్తుంటాయి. మనం . లోన్ తీసుకుంటే రూ. 5 లక్షలపై ఏడేళ్ల వ్యవధికి నెలకు ఈఎంఐ ఎంత పడుతుందో తెలుసుకుందాం. అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐలో 8.90 శాతం నుంచి కార్ లోన్ వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. ఇక్కడ 5 లక్షలకు చూస్తే.. నెలకు ఈఎంఐ రూ. 8019 పడుతుంది. మొత్తం టెన్యూర్‌లో వడ్డీ రూ. 1.73 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. >> అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో కార్ లోన్ వడ్డీ రేట్లు 9.40 శాతం నుంచి మొదలవుతున్నాయి. ఇక్కడ ఈఎంఐ 5 లక్షలపై నెలకు రూ. 8146 చెల్లించాల్సి వస్తుంది. వడ్డీతో మొత్తం రూ. 1.84 లక్షలు చెల్లించాలి. >> ఐసీఐసీఐ బ్యాంకులో చూస్తే కార్ లోన్ వడ్డీ రేట్లు 9.15 శాతం నుంచి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ 5 లక్షల రుణంపై నెలకు ఈఎంఐ రూ. 8083 గా ఉంది. >> బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చాలా తక్కువగా 7.70 శాతం నుంచే ఉండగా.. ఇక్కడ ఈఎంఐ రూ. 7,719 చాలు. వడ్డీతో మొత్తం రూ. 1.48 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. >> పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 7.85 శాతం నుంచి అందుబాటులో ఉండగా.. ఇక్కడ ఈఎంఐ రూ. 7,756 చొప్పున పడుతుంది.