ఎట్టకేలకు రెండేళ్ల కల సాకారం.. జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ప్రారంభం..

Wait 5 sec.

సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండల కేంద్రం.. సముద్రాల, బస్వాపూర్ గ్రామాల మధ్య గల జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పూర్తయింది. ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, ప్రభాకర్ జిల్లా కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ సమక్షంలో ప్రారంభించారు. ప్రజలకు ఊరట.. దాదాపు రెండేళ్లుగా రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డు పక్కన నివసిస్తున్న ప్రజలు కూడా చీకటిలో నడవడం సాహసంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పుడు లైటింగ్ ప్రారంభం కావడంతో ప్రమాదాలు తగ్గుతాయని, రాత్రి సురక్షిత ప్రయాణం సాధ్యమవుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.ప్రభుత్వ కృషి.. రోడ్డు భద్రత, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు విద్యుత్ శాఖ, ఆర్ అండ్ బి అధికారులు సమన్వయం సాధించి లైటింగ్ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేశారని వివరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. భద్రతా పరిరక్షణ.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వలన తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. వాహనదారులకు స్పష్టమైన వెలుతురు లభించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని.. అలాగే చిన్నచిన్న నేరాలకు కూడా అడ్డుకట్ట పడుతుందని పోలీసులు పేర్కొన్నారు. పాల్గొన్న ప్రముఖులు.. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద ధర్మయ్య, సీనియర్ నేతలు భీమ్ రెడ్డి మల్లారెడ్డి, గోరిట్యాల లక్ష్మణ్, చింతకింది శంకర్‌తో పాటు ఆర్ అండ్ బి అధికారులు, విద్యుత్ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. అభివృద్ధి వైపు అడుగు.. సెంట్రల్ లైటింగ్‌తో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణ, డ్రైనేజ్ సదుపాయాల మెరుగుదల, పాదచార మార్గాల నిర్మాణం కూడా చేపడతామని అధికారులు తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి దిశగా ఇది ఒక కీలక ముందడుగని స్థానికులు అభిప్రాయపడ్డారు.