హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'అఖండ 2: తాండవం'. 'అఖండ' సీక్వెల్ గా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన 'సింహా', 'లెజెండ్', 'అఖండ' సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. దీంతో 'అఖండ 2'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి. 'అఖండ 2: తాండవం' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రూ. 80 - 85 కోట్ల మధ్య డీల్ క్లోజ్ అయినట్లుగా టాక్ నడుస్తోంది. సినిమాపై నెలకొన్న హైప్ దృష్ట్యా భారీ రేటుకు ఓటీటీ రైట్స్ తీసుకోడానికి నెఫ్ ఫ్లిక్స్ వెనకాడలేదని అంటున్నారు. బాలయ్య నటించిన 'డాకు మహారాజ్' సినిమా డిజిటల్ హక్కులను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.