లో టీమిండియా ఇవాళ తన తొలి మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ విజేతతో పాటు, . టీ20 వరల్డ్ కప్ 2026 మరికొద్ది నెలల్లో ప్రారంభం కానుండగా టీమిండియా ప్లేయర్లకు అత్యంత కీలకంగా మారనుంది. దాంతో ఈ టైటిల్‌ను అందుకోవాలనే లక్ష్యంతో భారత్ ఉంది. పసికూన యూఏఈతో టీమిండియా తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను సోనీ స్పోర్ట్స్‌ టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్, డిజిటల్‌లో ప్రేక్షకులు వీక్షించొచ్చు. యూఏఈతో మ్యాచ్ నేపథ్యంలో భారత్ తన ప్లేయింగ్ 11ను ఎలా ఎంచుకోబోతోంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. చిన్న జట్టుపై సీనియర్లకు రెస్ట్ ఇచ్చి కుర్రాళ్లకు అవకాశం ఇస్తారా? లేక దుబాయ్ పరిస్థితులకు అలవాటు పడాలని కీలక ఆటగాళ్లను బరిలోకి దింపుతారా? అనేది అర్థం కావడం లేదు. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్, ముగ్గురు సీమర్లతో గ్రౌండ్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. శుభమన్ గిల్ జట్టులోకి రావడంతో ఇప్పుడు అందరి దృష్టి మీదే ఉంది. సంజూకి ప్లేయింగ్ 11లో చోటు దక్కుతుందా? లేదా? అనేదే సర్వత్రా ఆసక్తిగా మారింది. అయితే, ఆసియా కప్ ఆరంభానికి ముందు కెప్టెన్ల సమావేశంలో ఇదే ప్రశ్న తలెత్తగా భారత సారథి సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు. "మేము సంజును చాలా బాగా చూసుకుంటున్నాం. రేపు సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకు టెన్షన్ అవసరం లేదు” అంటూ స్పష్టం చేశాడు. ఇక ఇప్పటికే చాలా కాలంగా స్క్వాడ్‌లో ఉన్నా ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేక పోతున్న కుల్దీప్ యాదవ్‌కి మరోసారి మొండిచేయి మిగిలేట్టే కనిపిస్తోంది. దుబాయ్ పిచ్ దృష్ట్యా స్పెషలిస్ట్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. దాంతో కుల్దీప్‌కి ఈ సారి కూడా నిరాశ మిగిలేట్టు తప్పడం లేదు. శివమ్ దుబేని పూర్తి స్థాయి ఆల్‌రౌండర్‌గా చేయాలని చూస్తున్నారు. రవీంద్ర జడేజా స్థానాన్ని దుబేతో భర్తీ చేయాలని భారత్ చూస్తోంది. హార్డ్ హిట్టర్ అయిన దుబేతో బౌలింగ్ కూడా చేయిస్తే మరో స్పెషలిస్ట్ బౌలర్ అవసరం లేదని అంచనా. ఇక మెయిన్ బౌలర్లుగా జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌కి చోటు ఖాయం.ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున అదరగొట్టిన జితేశ్ శర్మ సేవలు వినియోగించుకోవాలని గౌతమ్ గంభీర్ చూస్తున్నాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ బలంగా చేసేందుకు వికెట్ కీపర్‌గా జితేశ్‌ని ఆడించాలని చూస్తున్నారు. ఒకవేళ జితేశ్ జట్టులోకి వస్తే మాత్రం సంజూ ప్లేయింగ్ 11లో లేనట్టే అని అర్థం. మొత్తానికి ఆల్‌రౌండర్లు, హిట్టర్లతో కూడిన టీమిండియా స్క్వాడ్‌ నుంచి ప్లేయింగ్ 11లో ఎవరికి చోటు దక్కుతుందో.. ఎవరికి నిరాశ మిగులుతుందో వేచి చూడాలి మరి!టీమిండియా ప్లేయింగ్ 11 అంచనాఅభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, సంజూ శాంసన్/జితేశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్.