నా బ్రెయిన్ విలువ నెలకు రూ.200 కోట్లు.. డబ్బు కోసం దిగజారిపోను.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

వాహనాల్లో ఇంధన ముఖ్యంగాపై సోషల్ మీడియా లో జరుగుతోన్న చర్చ.. తనను టార్గెట్ చేయడం పట్ల కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి స్పందించారు. నాగపూర్‌లో జరిగిన అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ.. తన బ్రెయిన్ విలువ నెలకు రూ.200 కోట్లని, డబ్బులు కోసం దిగజారాల్సిన అవసరం తనకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై గతంలోనే పెట్రోల్‌తో ఇథనాల్ కలిపి వాడటం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు.. ఇంధన ధరలు కూడా తగ్గుతాయని ఆయన చెప్పిన విషయం తెలిసిందే.‘‘ముందుగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను... ఇదంతా నేను డబ్బులు కోసం చేయడం లేదు. ఈ విషయం చెప్పకుంటే వేరేలా అనుకుంటారు.. నా ఆదాయానికి కొరత లేదు.. నా మేధస్సు విలువ నెలకు రూ.200 కోట్లు.. నాకు ఆర్ధికంగా ఎటువంటి కొరత లేదు’’ అని అన్నారు. తన కొడుకులకు ఐడియాలు ఇస్తుంటానని, ఎప్పుడూ ఎలాంటి అక్రమాలు, అవకతవకులకు పాల్పడేది లేదని గడ్కరీ తేల్చిచెప్పారు.పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి (ఈ-20) వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహించడంపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ-20 వినియోగం వల్ల గడ్కరీ కుమారులు లబ్ది పొందారని, అందుకే ఇథనాల్ ఉత్పత్తిపై లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించింది. దీనిని తీవ్రంగా ఖండించిన నితిన్ గడ్కరీ.. ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న 'పెయిడ్ క్యాంపెయిన్‌'గా కొట్టిపారేశారు. రాజకీయంగా తనను టార్గెట్ చేసేందుకు జరుగుతున్న ప్రచారమని ఆయన తెలిపారు. గతవారం ది ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ కాన్ఫరెన్స్ 2025లో గడ్కరీ మాట్లాడుతూ.. చక్కెర కర్మాగారాలు తమ కార్యకలాపాలను వైవిధ్యంగా సాగించి, మిగులు ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఇథనాల్-డీజిల్ బ్లెండింగ్ ఎంపికలను అన్వేషించాలని కోరారు.‘‘ఇప్పుడు భారత్ చక్కెర ఉత్పత్తి తగ్గించడానికి ప్రత్యామ్నాయం లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో మిగులు ఉత్పత్తి దేశంలో పెద్ద సమస్యను సృష్టిస్తుంది’’ అని గడ్కరీ అన్నారు. అయితే, ఈ-20 పెట్రోల్‌ వినియోగంతో సమస్యలు వస్తున్నాయని వాహనదారులు, మెకానిక్‌లతోపాటు, నిపుణులు కూడా మీడియా, సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా.. న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే, గడ్కరీ కూడా ఇథనాల్ కలిపి వాడిన పెట్రోల్ కారణంగా సమస్య వచ్చిన వాహనం ఒక్కటైనా చూపించాలని ఆయన ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది.