ప్రభుత్వం ఏపీలోని ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లను ఆదుకునేందుకు . దీని ద్వారా డ్రైవర్లకు ప్రతి సంవత్సరం 15 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, బీమా, మరమ్మతులు వంటి అవసరాల కోసం అక్కరకు వచ్చేలా ఈ ఆర్థిక సాయం అందజేస్తారు. సొంతంగా ఆటో, క్యాబ్, మోటార్ క్యాబ్ ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. వీరికి వాహనమిత్ర కింద రూ.15000 సాయం చేస్తారు. ఈక్రమంలో తాజాగా ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిధుల విడుదల తేదీలను ప్రకటించింది ప్రభుత్వం. ఆ వివరాలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బులను జమ చేస్తారు. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వాటి ప్రకారం.. దరఖాస్తుదారులకు కొన్ని అర్హతలు ఉండాలి. అవి ఏంటంటే..లబ్ధిదారులకు ఏపీలో జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆటో రిక్షా లేదా లైట్ మోటార్ వెహికల్ నడపడానికి లైసెన్స్ చెల్లుబాటులో ఉండాలి. వాహనం ఆంధ్రప్రదేశ్‌లోనే రిజిస్టర్ అయి ఉండాలి. మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. అయితే ఆటో రిక్షా విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకపోతే.. ఈ ఒక్క సంవత్సరం అనగా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. కానీ, ఒక నెలలోపు ఆ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.వీరికి మాత్రమే వాహనమిత్ర..ఈ పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్‌) ఉండాలి. లేదంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. దరఖాస్తుదారు లేదా వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉంటే ఈ పథకానికి అనర్హులు. కానీ, పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయింపు ఉంటుంది. ఇంటి విద్యుత్తు వినియోగం నెలకు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి. దీని కోసం దరఖాస్తు తేదీకి ముందు 12 నెలల సగటును లెక్కిస్తారు. వాహనాలకు ఎలాంటి పెండింగ్ బకాయిలు, చలాన్లు ఉండకూడదు. భూమి విషయానికి వస్తే.. మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు భూమి ఉండాలి. రెండు కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస లేదా వాణిజ్య నిర్మాణం ఉండకూడదు.సెప్టెంబర్ 17 నుంచి దరఖాస్తుల స్వీకరణవాహనమిత్ర పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల అనగా సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని కన్నా ముందు సెప్టెంబర్ 15 నాటికి వాహనాల జాబితా, రిజిస్ట్రేషన్ నంబరు, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబరుతో కూడిన వివరాలను ప్రభుత్వం జీఎస్‌డబ్ల్యూఎస్‌కు అందిస్తుంది. 2023-24లో ఆర్థిక సహాయం పొందిన లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విశ్లేషిస్తారు.వాహనమిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గ్రామ, వార్డు సచివాలయాల విభాగం (జీఎస్‌డబ్ల్యూఎస్‌డీ) సెప్టెంబర్ 17 నాటికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేస్తుంది. కొత్త లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 19 వరకు అవకాశం ఉంటుంది. ఈ నెల 22 నాటికి సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తారు.ఆ తర్వాత తుది జాబితా సెప్టెంబర్ 24కు సిద్ధమవుతుంది. లబ్ధిదారుల జాబితాను కార్పొరేషన్‌ల వారీగా జీఎస్‌డబ్ల్యూఎస్‌ విభాగం 24 నాటికి రవాణా శాఖకు పంపుతుంది.ఆ తర్వాత అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తారు.