. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్లారు.మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ “పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కుటుంబాలతో మేము నిలబడ్డాం. మా ధైర్యవంతమైన సైనికులకు ఈ విజయం అంకితం చేస్తున్నాం. వారు చూపిన ధైర్యం, త్యాగం మాకు ప్రేరణ. ఎప్పుడైనా మైదానంలో అవకాశమొస్తే వారిని గర్వపడేలా ప్రదర్శించాలనుకుంటాం” అని భావోద్వేగంతో అన్నాడు.పోస్ట్‌–మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో సూర్యకు శుభాకాంక్షలు తెలియజేసిన సంజయ్ మంజ్రేకర్ “హ్యాపీ బర్త్‌డే” అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సూర్య సమాధానమిస్తూ “ఈ విజయం దేశానికి నా రిటర్న్ గిఫ్ట్” అని చెప్పి అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.ఈ ఏడాది కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది అమాయకులు మరణించారు. ఈ ఘటన అనంతరం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ దాడి బాధితులపై సానుభూతి వ్యక్తం చేస్తూ, సైనికులకు అంకితం చేసిన ఈ విజయం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా రెండు జట్ల కెప్టెన్ల మధ్య ఏ హ్యాండ్‌షేక్ జరగకపోవడం, కళ్లలోకి చూడకుండా నేరుగా ఆటలోకి దిగడం గమనార్హం. భారత్‌లోని అభిమానులు ముందుగానే బీసీసీఐ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పోరు మరింత సున్నితంగా మారింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఆరంభంలోనే తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసుకున్నారు. అయితే పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ హారీస్ రాణించడంతో పాక్ గౌరవ ప్రధమైన స్కోర్ చేయగలిగింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కేవలం 3 పరుగులకే అవుటవ్వగా.. ఆఖర్లో షాహీన్ అఫ్రిది 16 బంతుల్లో 33 పరుగులు చేశాడు. దాంతో పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. ఈజీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేయగా, గిల్ 7 బంతుల్లో 10 పరుగులు చేసి అవుటయ్యారు. తిలక్ వర్మ కూడా 31 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్య 47, దుబే 10 పరుగులతో మ్యాచ్‌ని ముగించారు. 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.