. సెప్టెంబర్ 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. తిరుమల సెప్టెంబర్ 24 నుంచి మొదలు కానున్నాయి. అక్టోబర్ రెండో తేదీ వరకూ తిరుమల బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 16నలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16వ తేదీన అష్టదళ పాద పద్మారాధన సేవ, వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగతా వారికి వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మరోవైపు ఏడాదిలో నాలుగు సార్లు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో.. ఆయా రోజులకు ముందుగా వచ్చే మంగళవారం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16న జరగనుంది. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనేది తమిళ పదం. దీని అర్థం గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసే కార్యక్రమం.కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సమయంలో శ్రీవారి ప్రధాన మూర్తిని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచుతారు. అన్ని దేవతా మూర్తులను, ఇతర వస్తువులను ఆలయంలోని గర్భగుడి నుంచి బయటకు తీసుకువస్తారు. అనంతరం కర్పూరం, గంధం, కుంకుమ, పసుపు, కిచ్చిలి గడ్డ, సుగంధ మిశ్రమంతో శుభ్రం చేస్తారు. ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకూ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కొనసాగుతుంది. ఆ తర్వాత ప్రధాన విగ్రహంపై ఉన్న వస్త్రాన్ని తొలగిస్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, నైవేద్యం సమర్పించిన అనంతరం.. పది గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం రోజున పలు సేవలను టీటీడీ రద్దు చేస్తూ ఉంటుంది.