ఏపీలో కోర్టులకు బాంబు బెదిరింపులు.. రూటు మార్చారా!

Wait 5 sec.

ఏపీలోని పలు కోర్టులకు గురువారం వచ్చాయి. చిత్తూరు, అనంతపురం, ఏలూరు వచ్చాయి. కోర్టు సిబ్బంది వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేయటంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే కోర్టుల వద్దకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. కోర్టులోని న్యాయవాదులు, సిబ్బందితో పాటుగా కక్షిదారులను కోర్టు నుంచి బయటకు పంపించి డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టు పరిసరాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మరోవైపు ఈ మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా జడ్జి భీమారావు వెల్లడించారు. ఈ విషయం ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ బాంబు బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. దీని వెనుక ఎవరున్నారు.. ఆకతాయిలా పనా అనే కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలతో ఆయా కోర్టులలో కార్యకలాపాలు కొంతసేపు నిలిచిపోయాయి. మరోవైపు గతేడాది కూడా దేశవ్యాప్తంగా ఇలా బాంబు బెదిరింపుల ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఆధ్యాత్మిక నగరం తిరుపతికి, 2025 అక్టోబర్, డిసెంబర్ నెలల్లో పలుసార్లు ఇలాంటి బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, హోటల్స్‌లలో బాంబులు పెట్టారంటూ బెదిరింపులు రాగా.. పోలీసులు అప్రమత్తమై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇక తిరుపతిలో బాంబులు పెట్టారంటూ ఏకంగా డీజీపీ ఆఫీసుకు ఈ-మెయిల్స్‌ రావడం అప్పట్లో సంచలనం రేపింది. దీంతో తిరుపతిలోని కీలక ప్రాంతాలలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. కొంతమంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఇదే తరహాలో బాంబు బెదిరింపులు చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో హోటల్స్, విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్‌లకు బాంబు బెదిరింపులు రాగా.. ఏపీలో ఎప్పుడు లేనట్లుగా ఈసారి కోర్టులకు బెదిరింపులు రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో దీనికి కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.