ఎన్నికల వేళ బెంగాల్‌కు వరం.. ఈనెల 17న తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Wait 5 sec.

దేశంలో రైల్వే ప్రయాణికుల చిరకాల కోరిక అయిన రాత్రి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ.. తీయనుంది. జనవరి 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 18వ తేదీ నుంచి హౌరా నుంచి గువహటి మధ్య సాధారణ ప్రయాణికులకు హౌరా నుంచి గువహటి మధ్య ఈ బందేల్, కత్వా, న్యూ ఫరక్కా, మాల్దా టౌన్, న్యూ జల్పాయ్ గురి, న్యూ కూచ్ బెహార్, న్యూ బొంగైగావ్ వంటి కీలక రైల్వే స్టేషన్లలో ఆగనుంది. మరికొన్ని రోజుల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆ రాష్ట్రానికి వందే భారత్ స్లీపర్ తొలి రైలును ప్రకటించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ స్లీపర్ రైలు టికెట్ ధరలను నిర్ణయించినట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. ఏసీ 3 టైర్ టికెట్ ధర హౌరా నుంచి గువహటి వరకు సుమారు రూ. 2,300 ఉంటుందని పేర్కొంది. అదే ఏసీ 2 టైర్ టికెట్ ధర సుమారు రూ. 3 వేలు.. ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర సుమారు రూ. 3,600గా ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అయితే ఈ టికెట్ ధరలోనే ప్రయాణికులకు అందించే భోజనం కూడా కలిసి ఉంటుంది.రైలు ప్రత్యేకతలు, సౌకర్యాలుఈ వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణించే వీలు ఉంటుంది. వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్స్‌లో 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంది. అయితే.. సాధారణ ప్రయాణంలో గంటకు 120 కిలోమీటర్ల నుంచి 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు ఎంత వేగంగా వెళ్లినా కుదుపులు లేకుండా ఉండేలా ప్రత్యేక సస్పెన్షన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.గువహటి నుంచి వచ్చే రైలులో అస్సామీ వంటకాలు.. హౌరా నుంచి వెళ్లే రైలులో బెంగాలీ వంటకాలు ప్రయాణికులకు అందించనున్నారు. రైల్వే ప్రమాదాలను నివారించే స్వదేశీ కవచ్ టెక్నాలజీ, నిరంతరం సీసీటీవీ నిఘాను ఏర్పాటు చేశారు. వైరస్‌లు, బ్యాక్టీరియాను పూర్తిగా లేకుండా చేసే అత్యాధునిక డిస్‌ఇన్‌ఫెక్టెంట్ టెక్నాలజీని కూడా ఈ రైలులో ఉపయోగిస్తున్నారు.