అమెరికా సైన్యం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో వెనుజులా అధ్యక్షుడు నికలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌లను యూఎస్ బలగాలు అమెరికాకు తీసుకెళ్లాయి. ఈ నేపథ్యంలో లాటిన్ అమెరికా దేశాల్లో ఆందోళనలు నెలకొన్నాయి. క్యూబా, కొలంబియా వంటి దేశాలు అమెరికా తీరుపై మండి పడుతున్నాయి. తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ చమురు, బొగ్గుపై ఆధారపడి ఉన్నంత కాలం.. యుద్ధాలను కోరుకుంటూనే ఉంటుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా పారిస్ ఒప్పందం నుంచి వైదొలగకపోతే.. యుద్ధాలు ఉండేవి కాదన్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూలో గుస్తావో పెట్రో ఈ వ్యాఖ్యలు చేశారు. దాదాపు 70 శాతం అమెరికా ఇంధన అవసరాలు చమురు, బొగ్గుతోనే తీరుతున్నాయన్నారు. అందుకే ఈ రెండు వనరుల కోసం అమెరికా యుద్ధాలను కోరుకుంటూనే ఉంటుంది పెట్రో అన్నారు. కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాతావరణ మార్పు కార్యకలాపాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి.. 198 దేశాల మధ్య 1992లో పారిస్ ఒప్పందం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి తిరిగి వచ్చిన వెంటనే ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఇలా జరగకపోయి ఉంటే అసలు యుద్ధాలే ఉండేవి కాదన్నారు గుస్తావో పెట్రో. అంతేకాకుండా ప్రపంచంతో, సౌత్ ఆమెరికాతో కూడా మంచి అమెరికాకు సంబంధాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. వెనుజులాపై అమెరికా చర్యను ఇటీవల పలు లాటిన్ అమెరికా దేశాలు తప్పుపట్టాయి. దీనిపై స్పందించిన యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మెక్సికో, క్యూ అంతేకాకుండా డ్రగ్స్ అక్రమ రవాణాలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో హస్తం ఉందని ఆరోపించారు. మిలిటరీ దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో గుస్తావో పెట్రో ట్రంప్‌తో గంటసేపు ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఫోన్ కాల్ తర్వాత కొలంబియా- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయని.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూడా ఇరు దేశాల సహకారం బలపడుతుందని తాము ఆశిస్తున్నట్లు కొలంబియా ప్రకటన వెలువరించింది. ఈ క్రమంలోనే గుస్తావో పెట్రో వైట్‌హౌస్‌ పర్యటన ఖరారు కావడం గమానర్హం. ఇదిలా ఉండగా, అమెరికా- వెనిజులా తమ దౌత్య సంబంధాలను పునరుద్ధరించే అవకాశాన్ని అన్వేషిస్తున్నాయని ఇరు దేశాల ప్రభుత్వాలు శుక్రవారం వెల్లడించాయి. అంతేకాకుండా ఓ వైట్‌హౌస్ బృందం వెనుజులా చేరుకుందని తెలిపాయి.