తిరుమలలో టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతలు.. రెండుసార్లు ఎందుకంటే!

Wait 5 sec.

సీనియర్ ఐఏఎస్ అధికారి తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 'శుక్రవారం ఉదయం 7.34 గంటలకు బాధ్యతలు స్వీకరించి.. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్య కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈవో దంపతులకు రంగ నాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో తీర్థ ప్రసాదాలు అందజేశారు. గత నెల రోజులుగా తిరుమలలో చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. సాటి భక్తుడిగా సేవ చేస్తానని చెప్పారు. భక్తుల నుండి చాలా సలహాలు సూచనలు వచ్చాయని, వాటిని తానే స్వయంగా పరిశీలించి ఆ అనుభవంతో భక్తులకు మంచి ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు' అంటూ టీటీడీ ప్రకటన విడుదల చేసింది.టీటీడీ ఈవోగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.. అయితే ఆయన పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించలేదు. సీఎం ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రిటైర్డ్ సీఎస్ కె విజయానంద్‌‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ముద్దాడ రవిచంద్రను టీటీడీ పూర్తిస్థాయి ఈవోగా నియమించడంతో తాజాగా పూర్తిస్థాయిలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఒంటిమిట్టలో పచ్చదనంఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం సమీపంలోని రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టల్లో పచ్చదనం పెంచేందుకు టిటిడి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఒంటిమిట్ట ఆలయం పరిసర ప్రాంతాల్లో పచ్చదనం మరింత పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు టిటిడి అటవీ శాఖ వాతావరణంకు అనుకూలంగా దీర్ఘకాలికంగా చెట్లు పెరిగేలా ప్రణాళికలు రూపొందించింది. టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం గురువారం రామతీర్థం గుట్టను పరిశీలించి అటవీ శాఖ, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. రామతీర్థం, లక్ష్మణతీర్థం గుట్టలు కలిపి సుమారు 10 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఎక్కువగా పెద్ద రాళ్లతో ఉండటంతో, రాళ్ల మధ్య కూడా పెరిగే జాతికి చెందిన మొక్కలను నాటే కార్యక్రమం ప్రారంభించారు. ప్రయోగాత్మకంగా రావి, మర్రి, తెల్లమద్ది, జీలుగు వంటి చెట్లను నాటారు. దశలవారీగా దాదాపు 3 వేల చెట్లను నాటేందుకు టిటిడి ప్రణాళికలు సిద్ధం చేసింది. రాళ్ల మధ్యలో కూడా ఈ చెట్లు బాగా పెరిగేలా ప్రారంభ దశలో ప్రత్యేకంగా సంరక్షణ చేపడుతున్నారు. ప్రణాళికాబద్ధంగా మొక్కలు నాటి ఒంటిమిట్ట పరిసర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపేందుకు టిటిడి చర్యలు చేపట్టింది.