60 శాతానికి చేరనున్న డీఏ? త్వరలోనే కేంద్రం ప్రకటన.. 30 వేల జీతం ఉంటే ఎంత పెరగనుందంటే?

Wait 5 sec.

: పెరుగుతున్న ధరలకు పరిహారంగా కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డియర్‌నెస్ రిలీఫ్) ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఏటా రెండు సార్లు దీనిని ప్రకటిస్తుంటుంది. జనవరి 1, జులై 1 నుంచి ఇవి అమల్లోకి వస్తుంటాయి. కానీ ఏటా మొదటి అర్ధభాగంలో హోలీ సమయంలో మార్చి నెలలో, మళ్లీ రెండో అర్ధభాగంలో దీపావళి సమయంలో అక్టోబర్- నవంబరులో డీఏపై ప్రకటన చేస్తుంటుంది. ఎప్పుడు ప్రకటించినా.. జనవరి 1, జులై 1 నుంచే అమల్లోకి తీసుకొచ్చి.. దానికి అనుగుణంగా మిగతా నెలల అరియర్స్ (బకాయిలు) కలిపి చెల్లిస్తుంటుంది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా ప్రతిసారీ డీఏ పెరుగుతూనే ఉంటుంది. ఇక పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ఉంటుంది. ఈ రెండూ ఉద్యోగుల బేసిక్ పే పైనే వర్తిస్తుందని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు హోలీ ముగిసినా.. ఇంకా డీఏ, డీఆర్‌పై మాత్రం ప్రకటన రాలేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు దీని కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారని చెప్పొచ్చు. ఒకవైపు . సాధారణంగా ఇది ఫిబ్రవరిలోనే విడుదలవుతుంటుంది ఇప్పుడు మార్చి వచ్చినా ఇంకా దాని ఊసే లేదు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు డీఏ పెంపుపైనా స్పష్టత లేదు. ఇప్పుడు 2026 జనవరికి సంబంధించి 2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. డీఏ పెంపు అనేది ఇండస్ట్రియల్ వర్కర్స్- ఆల్ ఇండియా కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI- IW) 12 నెలల సగటు ఆధారంగా లెక్కిస్తారు. ఈ లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు డీఏ మరో 2 శాతం మేర పెరగాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉండగా.. ఇది 2 శాతం పెరిగితే 60 శాతానికి చేరుతుంది. అప్పుడు దానికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఉద్యోగి బేసిక్ పే రూ. 30 వేలు ఉంటే డీఏ ఎంత పెరుగుతుందో చూద్దాం. 30 వేల బేసిక్ పే పై ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉండగా.. డీఏ రూపంలోనే ఉద్యోగికి రూ. 17,400 అందుతుంది. ప్రతి నెలా జీతం రూ. 47,400 అందుతుంది. ఇప్పుడు 2 శాతం డీఏ పెరిగితే రూ. 600 మేర డీఏ పెరుగుతుంది. అప్పుడు డీఏ రూపంలో రూ. 18 వేలు అందుతుంది. మొత్తం జీతం రూ. 48 వేలు అవుతుంది. ఇదే రూ. 50 వేల బేసిక్ పే ఉంటే.. ప్రస్తుత 58 శాతం ప్రకారం చూస్తే డీఏ రూ. 29 వేలుగా ఉంది. ఇప్పుడు 2 శాతం పెరిగితే డీఏ రూ. 1000 పెరుగుతుంది. అప్పుడు డీఏ రూపంలో రూ. 30 వేలు అందుతుంది. మొత్తం జీతం రూ. 80 వేలు అవుతుంది.