కామారెడ్డి మిస్సింగ్ కేసులో విషాదం.. చెరువులో మృతదేహాలు

Wait 5 sec.

లో విషాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నుంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లు కనిపించకుండాపోగా.. అదృశ్యమైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు చెరువులో లభ్యమయ్యాయి. మరో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారుల తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి ఆర్‌బీనగర్‌ కాలనీకి చెందిన సీపాత్‌ అనే ఎనిమిదేళ్ల బాలిక, అయాత్ అనే ఏడేళ్ల బాలిక, మరియం అనే ఐదేళ్ల చిన్నారి శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయారు. వీరు ముగ్గురూ అక్కాచెల్లెళ్లు కాగా.. ఉదయం ముగ్గురిని ఆటోలో తీసుకెళ్లి షాపు వద్ద దింపినట్లు చిన్నారుల తండ్రి చెప్తున్నారు. ఆ తరువాత తాను ఆటో కిరాయి వస్తే వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. ఆ తరువాత నుంచి వారు కనిపించకుండా పోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి తోడు శుక్రవారం రోజు కామారెడ్డి గోసంగి కాలనీలో ఉండే సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారులు కూడా కనిపించకుండా పోయారు. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు పిల్లలు అదృశ్యం కావటం, అందరూ పదేళ్లలోపు వారు కావటంతో ఆందోళన వ్యక్తమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిల్లల అదృశ్యం ఘటనలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి రూరల్ సీఐ రామన్, కామారెడ్డి సీఐ నరహరి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఇద్దరి మృతదేహాలను స్థానికంగా ఉండే పెద్దచెరువులో గుర్తించారు. కనిపించకుండా పోయిన ఏడేళ్ల అయాత్, ఐదేళ్ల మరియం మృతదేహాలను చెరువులో గుర్తించారు. సీపాత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్నారుల తండ్రిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాలతో మద్యం మత్తులో అతనే చంపేసి చెరువులో పడేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నారు. అలాగే ఇతరుల హస్తం ఉంటుందా అనే కోణంలోనూ కామారెడ్డి పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు శుక్రవారం రోజు కనిపించకుండా పోయిన సింహాద్రి, విజయ్ అనే ఇద్దరు చిన్నారుల ఆచూకీ ఇంకా తెలియడం లేదు.