డేంజర్‌లో టీమిండియా.. గౌతమ్ గంభీర్‌ వల్లే ఇదంతా! హెడ్ కోచ్‌ని ఏకిపారేసిన భారత మాజీ క్రికెటర్!

Wait 5 sec.

బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు ఒక్కొక్కళ్లను టీమ్ నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టారు. టెస్టు ఫార్మాట్‌లో చాలా కాలం కొనసాగుతాం అని చెప్పిన , విరాట్ కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 సమయానికి జట్టులో రోహిత్ - కోహ్లి ఉంటారో? లేదో? అన్న వార్తలు తెరపైకి వస్తున్నాయి. వీటన్నింటికీ ఏకైక కారణం గౌతమ్ గంభీరే అంటూ మాజీ క్రికెటర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. భారత మాజీ క్రికెటర్ ఇటీవల నిర్ణయాలను ఏకిపారేశాడు. హెడ్ కోచ్ గంభీర్ ఒత్తిడి తీసుకుని వచ్చి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మా, రవిచంద్రన్ అశ్విన్‌ వంటి సీనియర్ ప్లేయర్లను భారత జట్టుకు దూరం చేశాడంటూ ఆరోపణలు చేశాడు. .తాజాగా తివారీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అశ్విన్, రోహిత్, కోహ్లి వంటి సీనియర్ ప్లేయర్లు జట్టులో ఉంటే, వారు అనవసరంగా హెడ్ కోచ్ లేదా ఇతర స్టాఫ్ నిర్ణయాలను ప్రశ్నిస్తారు. కాబట్టి, ఈ సీనియర్ క్రికెటర్లను తొలగించడం ద్వారా గంభీర్ తన నిర్ణయాలను ఎలాంటి ఆపేక్ష లేకుండా అమలు చేయగలడు” అని అన్నాడు.గంభీర్ వ్యవహారంపై సీరియస్‌ అయిన తివారీ “ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. టీమిండియాలో ఇప్పుడు చోటుచేసుకున్న పరిస్థితులు ఏవీ భారత జట్టుకు మంచివి కావు. అశ్విన్, రోహిత్, విరాట్ ముందుగానే రిటైర్డ్ అవ్వడం.. అనూహ్యంగా కొందరు ఆటగాళ్లు జట్టులో చేరడం జరిగాయి. గంభీర్ సరైన విధంగా నడుచుకోవడం లేదు" అని తన అభిమప్రాయం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారత క్రికెట్‌కు అద్భుతమైన సేవలు అందించారని తివారీ అన్నాడు. టీమిండియాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని.. అలాంటి ఈ ఆటగాళ్లను 2027 వన్డే వరల్డ్ కప్‌కు దూరం చేస్తే టీమిండియా డేంజర్‌లో పడుతుందని హెచ్చరించాడు. టీమిండియాకు అంత చేసిన లెజెండ్స్‌ రిటైర్మెంట్ ఛాన్స్ వాళ్లకే వదిలేయాలని తివారీ అన్నాడు.