రోజంతా బైక్‌పై భార్యాభర్తల సవారీ.. ఎవరికీ అనుమానం రాకుండా.. సిగ్గులేకుండా ఇదేం పని..!

Wait 5 sec.

వారిద్దరికి పెళ్లైంది. వ్యవసాయం చేస్తూ జీవితం సాగిస్తున్నారు. అయితే ఈ దంపతులిద్దరూ బైక్‌పై మధ్యాహ్న సమయంలో తిరిగేవారు. తమ గ్రామంతో పాటు మండలంలోని గ్రామాలో విహారం చేసేవారు. అయితే ఒక రోజు, రెండు రోజులు కాదండోయ్.. తరచూ వీరికి ఇదే పని. భార్యను బైక్‌పై తిప్పితే తప్పేంముంది అనుకునేరు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. వీరు అలా ఎందురు తిరిగిగేవారో చివరికి పోలీస్ స్టేషన్‌లో తేలిపోయింది. ఏపీలోని గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరురు గ్రామానికి చెందిన కఠారి వెంకటేశ్వర్లుకు.. తేజ నాగమణి మహిళతో కొన్నేళ్ల క్రితం పెళ్లైంది. వీరిది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొన్నాళ్లుగా ఈ దంపతులిద్దరూ పగటి పూట బైక్‌పై తమ గ్రామంతో పాటు మండలంలోని ఇతర ఊళ్లలో తిరుగుతుండేవారు. బంధువుల ఇంటికి పోవడానికి కాదు, స్నేహితులను కలవడానికి కాదు.. ఏ పని మీదో కాదు.బైక్‌పై తిరిగేది ఇందుకే..!ఏయే ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి, వారు ఊళ్లోనే ఉన్నారా లేరా అనే వివరాలు తెలుసుకునేందుకు బైక్‌పై చక్కర్లు కొట్టేవారు వెంకటేశ్వర్లుకు, నాగమణి. వీధి వీధుల్లో తిరుగుతూ తాళాలు లేని ఇళ్లను గాలించేవారు. అంతేకాకుండా.. ఆ ఇంట్లోని వారు అదే గ్రామంలో ఉన్నారా, విహారయాత్రల కోసం ఎటైనా వెళ్లారా అనే వివరాలు సేకరించే వారు. ఇలా పగటిపూట రెక్కీ చేసుకున్న తర్వాత.. రాత్రుళ్లు ఇళ్లకు కన్నాలేసేవారు. అయితే ఎవరికీ అనుమానం రాకుండా.. ఉండేందుకు తమ గ్రామంతో పాటు ఇతర మండలంలోని గ్రామాల్లోనూ దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. పోలీసులకు ఇలా చిక్కారు..ఎవరికీ అనుమానం రాకుండా పక్క ప్లాన్‌తో చోరీకి పాల్పడేవారు వెంకటేశ్వర్లు, నాగమణి దంపతులు. అయితే తమ సొంత గ్రామం తూములూరికి చెందిన మధుసూధనా రావు ఇంట్లో దొంగతనం జరిగింది. అతడు సెప్టెంబర్ 28న వేరే ఊరికి వెళ్లి.. అక్టోబర్ 2న తిరిగివచ్చాడు. తిరిగొచ్చి చూసేసరికి ఇళ్లంతా దొంగలు ఊడ్చేశారు. దీంతో కంగుతిన్న మధుసూదనారావు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అందులో వెంకటేశ్వర్లు, నాగమణి బండిపై తిరుగుతున్నట్లు కనిపించింది. దీంతో వారికి గుర్తించిన పోలుసులు తమదైన శైలిలో విచారించగా.. నేరం అంగీకరించారు. ఇదే కాకుండా మరో 13 చోట్ల దొంగతనం చేశామని చెప్పారు. అనంతరం వారి దగ్గరి నుంచి రూ.2.15 లక్షల నగదు, 173 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక టీవీ, 226 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. అయితే రెక్కీ సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. వెంకటేశ్వర్లు భార్యతో కలిసి తిరిగేవాడని పోలీసులు తెలిపారు. భార్య కూడా దొంగతనాల్లో పాల్గొనేదని వెల్లడించారు.