ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లో టీమిండియా.. మెన్స్ టీమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ని ఇమిటేట్ చేసింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో సౌతాఫ్రికాపై పంత్ ఉపయోగించిన ట్రిక్‌నే వైజాగ్‌లోనూ చేసింది. అంతా బాగనే ఉంది కానీ రిజల్టే వర్కవుట్ కాలేదు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో సౌతాఫ్రికా ఆల్‌మోస్ట్ గెలిచేసింది అని అందరూ అనుకున్నారు. హెన్రిచ్ క్లాసెన్ వరుస సిక్సర్లు, ఫోర్లతో మ్యాచ్‌ని సౌతాఫ్రికా వైపు తీసుకెళ్లాడు. అదే సమయంలో రిషబ్ పంత్ తన కాలికి కండరాలు పట్టేశాయంటూ ఫిజియోను పిలిపించి మ్యాచ్‌ని కాస్త డైవర్ట్ చేశాడు. ఆ తర్వాత క్లాసెన్ అవుటవ్వడంతో మ్యాచ్ మలుపు తిరిగి చివరికి టీమిండియా విజయం సాధించింది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. సౌతాఫ్రికా బ్యాటర్ టీమిండియా బౌలర్లను ఊచకోత కోసింది. ఆఖరి ఓవర్లలో వరుస సిక్సర్లు, ఫోర్లు బాది ఎవ్వరూ ఊహించని విధంగా మ్యాచ్‌ని సఫారీల వైపు తిప్పేసింది. అప్పటి వరకూ భారత్ వైపు ఉన్న మ్యాచ్ ఒక్కసారిగా సౌతాఫ్రికా వైపు మళ్లడంతో.. కూడా మ్యాచ్‌ని కాస్త డైవర్ట్ చేసేందుకు ఫిజియోను రప్పించింది. ఇది చూసిన అందరూ రిచా ఘోష్ కూడా రిషభ్ పంత్‌‌లా చేస్తుందని అనుకున్నారు. అప్పటికే క్రాంతి గౌడ బౌలింగ్‌లో మొదటి మూడు బంతుల్లోనే వరుసగా రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాదిన డి క్లార్క్.. మ్యాచ్‌ని డిసైడ్ చేసేసింది. అయితే, కాస్త గ్యాప్ రావడంతో ఆ మిగతా మూడు బంతులు సింగిల్స్‌కే పరిమితమయ్యాయి. ఆఖరి ఐదు ఓవర్లలో యాభైకి పరుగులు పైగా కావాల్సి రాగా.. మరో ఏడు బంతులు మిగిల్చి మరీ సఫారీలు విజయం సాధించారు. డి క్లార్క్ 54 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఐదు సిక్సర్లతో 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విన్నర్ అయింది. అనూహ్య రీతిలో మ్యాచ్ గెలవడంతో సఫారీలు వైజాగ్‌లో సంబరాలు చేసుకున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ప్రతికా రావెల్, స్మృతి మంధాన శుభారంభం అందించినప్పటికీ టాప్ ఆర్డర్ విఫలమయింది. ఒకానొక దశలో 180 పరుగులు కూడా కష్టమే అనుకున్నారు. అదే సమయంలో రిచా ఘోష్ 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 94 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోర్ అందించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. కెప్టెన్ లారా వోల్వర్డ్ 70 పరుగులతో మ్యాచ్‌ని కాపాడింది. ఆఖర్లో క్లో ట్రయన్ - నాదిన్ డి క్లార్క్ మ్యాచ్‌ని నిలబెట్టగా.. డి క్లార్క్ ఆఖర్లో విజృంభించి సౌతాఫ్రికాకు గుర్తుండిపోయే విజయాన్ని అందించింది.