ఇక కనీస పెన్షన్ రూ.2500.. 11 ఏళ్ల తర్వాత EPFO కీలక నిర్ణయం.. ఈనెల 11న ప్రకటన?

Wait 5 sec.

EPFO: ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)కు చెందిన అత్యున్నత నిర్ణయాధికార కమిటీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) అక్టోబర్ 10, 11 తేదీల్లో బెంగళూరులో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కనీస పెన్షన్ పెంపుపై ప్రధానంగా చర్చ ఉండనుందని తెలుస్తోంది. అదే జరిగితే లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPF- 95) పరిధిలో కనీస పెన్షన్ ప్రస్తుతం నెలకు రూ. 1000గా ఉంది. దీనిని 2014లో నిర్ణయించారు. అప్పటి నుంచి అదే పెన్షన్ కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో వివిధ ఉద్యోగుల సంఘాలు కనీస పెన్షన్ రూ. 1000 అనేది చాలా తక్కువగా ఉందని, ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కనీస పెన్షన్ రూ. 7500లకు పెంచాలని పలు ట్రేడ్ యూనియన్లు, పెన్షనర్ల అసోసియేషన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డిమాండ్లు పెరుగుతున్న క్రమంలో కనీస పెన్షన్‌లో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు కనీస పెన్షన్‌ను 7.5 రెట్లు పెంచేందుకు సుముఖంగా లేరు. అయితే, రూ.1000 నుంచి రూ.2500లకు పెంచేందుకు ఆమోదం తెలపవచ్చని తెలుస్తోంది. . పెన్షన్ = (పెన్షన్ పరిధిలోని శాలరీ x పెన్షన్ సర్వీసు)/70. ఇందులో పెన్షన్ శాలరీ అంటే బెసిక్ శాలరీ ప్లస్ గత 60 నెలల డీఏ (గరిష్ఠంగా రూ. 15000)గా లెక్కలోకి తీసుకుంటారు. సర్వీసులో 6 నెలలకు మించి ఉంటే ఏడాదిగా పరిగణిస్తారు. పెన్షన్ పొందాలంటే కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉండాలి. పెన్షనేబుల్ శాలరీ గరిష్ఠ పరిమితి రూ. 15000గా ఉంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 సంవత్సరాలు సర్వీసులో ఉంటే అతనికి నెలకు రూ. 7500 వరకు పెన్షన్ లభిస్తుంది. 58 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగాల్సి ఉంటుంది. ముందే ఉద్యోగం వదిలేస్తే విత్‌డ్రాయల్ బెనిఫిట్స్‌తో పాటు తగ్గించిన పెన్షన్ లభిస్తుంది. అంటే చేతికి అందే పెన్షన్ భారీగా తగ్గిపోతుంది. పూర్తి సర్వీసులో ఉన్న వారికి గరిష్ఠ పెన్షన్ లభిస్తుంది.