AIM 120 అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అధునాతన అమ్రామ్ మిసైల్స్..!

Wait 5 sec.

అమెరికా, పాకిస్థాన్ మధ్య బలపడుతున్న సంబంధాలు యావత్తు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇటీవలలో భాగంగా అగ్రరాజ్యం అధునాతన మధ్య శ్రేణి క్షిపణులను దాయాదికి అందజేయనుంది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగలిగే అధునాత మీడియం రేంజ్ క్షిపణులు (AMRAAM) ఎయిమ్ 120 క్షిపణులను పాకిస్థాన్‌ త్వరలోనే అందుకోనుందని అమెరికా వార్ డిపార్ట్‌మెంట్ (రక్షణ శాఖ) ఓ ప్రకటన విడుదల చేసింది. రక్షణ శాఖ ప్రకటన ప్రకారం వివిధ దేశాల ఆయుధ ఒప్పందంలో AMRAAM క్షిపణుల కొనుగోలుదారుల జాబితాలో పాకిస్థాన్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. చేయడంపై పాక్ ప్రధాన మంత్రి షేహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్‌పై అసిమ్ మునీర్‌లపై స్వదేశంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ సందేహాలు లేవనెత్తింది. పాక్ పత్రిక నివేదిక ప్రకారం.. అమెరికా అందజేయనున్న AIM-120 క్షిపణులు పాకిస్థాన్ వాయుసేనకు చెందిన F-16 ఫాల్కన్ యుద్ధవిమానాల్లో అమర్చారు. ఈ క్షిపణులు 2019లో బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్ తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణ సమయంలో వీటిని పాక్ వైమానిక దళం ఉపయోగించినట్లు సమాచారం.పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 2019 ఫిబ్రవరి చివరిలో పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ కేంద్రంపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో జైషే సీనియర్ కమాండర్లు, శిక్షకులు సహా 300 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.క్షిపణి తయారీదారు రేథియాన్‌తో కుదిరిన 41.6 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధ సవరణ ఒప్పందంపై సెప్టెంబరు 30 అమెరికా యుద్ధ శాఖ ప్రకటన చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిమ్-120 క్షిపణులు C8, D3 మోడళ్లను తయారు చేయనున్నారు. ఈ ఒప్పందంలో పాక్ కూడా విదేశీ కొనుగోలుదారులు జాబితాలో చోటుదక్కించుకుంది. దీంతో ఈ ఒప్పందం 2.51 బిలియన్ డాలర్లకు మించి పెరిగినట్టు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.‘యూకే, పోలెండ్, పాకిస్థాన్, జర్మనీ, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, రొమేనియా, ఖతార్, ఒమన్, కొరియా, గ్రీస్, స్విట్జర్లాండ్, పోర్చుగల్, సింగ్‌పూర్, నెదర్లాండ్, చెక్ రిపబ్లిక్, జపాన్, స్లొవేకియా, డెన్మార్, కెనడా, బెల్జియం, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఇటలీ, నార్వే, స్పెయిన్, కువైట్, స్వీడన్, తైవాన్, లుథ్వేనియా, ఇజ్రాయెల్, బల్గేరియా, హంగేరీ, టర్కీ దేశాలు ఈ కాంట్రాక్టులో ఉన్నాయి’ అని అమెరికా వార్ డిపార్ట్‌మెంట్ ప్రకటన తెలియజేసింది. ఈ ఒప్పందంలోని దేశాలకు మే 2030 నాటికి క్షిపణులకు అందజేసే అవకాశం ఉంది. అయితే, పాకిస్థాన్‌కు ఎన్ని అమ్రాన్ క్షిపణులను సరఫరా చేస్తారనేది మాత్రం స్పష్టత లేదు. కానీ, ఈ పరిణామాలు పాక్ వైమానిక దళం తన ఎఫ్-16 ఫ్లీట్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటుందనే ఉహాగానాలకు కారణమైంది.అయినప్పటికీ అమ్రాన్ క్షిపణులు కేవలం పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడాది జులైలో పాక్ వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ జహీర్ అమ్మద్ బాబర్.. అమెరికాలో పర్యటించారు. నివేదికల ప్రకారం AIM-120C8 అనేది అమెరికా సైన్యం ప్రధానంగా వినియోగించే AIM-120D AMRAAM క్షిపణి ఎగుమతి వెర్షన్.ప్రస్తుతం పాకిస్థాన్ పాత AIM-120C5 వెర్షన్‌ను ఉపయోగిస్తోంది. 2010లో F-16 యుద్ధ విమానాల కోసం సుమారు 500 యూనిట్లను పాక్ కొనుగోలు చేసింది.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఘర్షణలను తగ్గించి, కాల్పుల విరమణ ఒప్పందంతో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంలోపాత్రను పాక్ ప్రశంసించింది. అంతేకాకుండా, ఆయనను నోబెల్ శాంతి బహుమతికి కూడా ప్రతిపాదించింది. అయితే, భారత్ మాత్రం ఇందులో ట్రంప్ ఘనత ఏమీలేదని, కేవలం భారత్, పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డీజీల స్థాయిలో జరిగిన చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు పునరుద్ఘాటిస్తూనే ఉంది.