నోబెల్ బహుమతి కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నామినేట్ అయినా.. అందులో చాలా ఫిల్టర్ చేసి.. తుది విజేతలను ప్రకటిస్తూ ఉంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ పురస్కారం దక్కాలంటే.. అసాధారణ ప్రతిభతోపాటు సరైన పరిస్థితులు కూడా అనుకూలించాలి. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, ఎకానమిక్స్, శాంతి రంగాల్లో ఇచ్చే ఈ నోబెల్ బహుమతుల కోసం.. ప్రతీ సంవత్సరం చాలా మంది నామినేట్ అవుతూ ఉంటారు. వారిలో అత్యద్భుత కృషి చేసిన వారిని నోబెల్ కమిటీ సభ్యులు ఎంపిక చేసి.. విజేతగా ప్రకటిస్తూ ఉంటారు. అయితే క్యూరీల కుటుంబంలో ఇప్పటివరకు 5 నోబెల్ బహుమతులు రావడం గమనార్హం. ఇందులో మేడం క్యూరీకి రెండు పురస్కారాలు వరించాయి. ఇది నోబెల్ ప్రైజ్ చరిత్రలో అపూర్వ రికార్డుగా సంబంధిత వర్గాలు చెబుతూ ఉంటాయి. అందుకే నోబెల్ చరిత్రలో క్యూరీల కుటుంబం రికార్డు కొనసాగుతోంది. నోబెల్ బహుమతి చరిత్రలో క్యూరీ కుటుంబం ఇప్పటికే సంచలనం సృష్టించింది. మేరీ క్యూరీ, పియరీ క్యూరీ, ఇరీన్ జోలియట్ క్యూరీ, ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీ కలిసి మొత్తం ఇప్పటివరకు 5 నోబెల్ బహుమతులను గెలుచుకున్నారు. ఇక రెండు వేర్వేరు సైన్స్ విభాగాల్లో (1903 ఫిజిక్స్, 1911 కెమిస్ట్రీ) మేరీ క్యూరీ రెండు నోబెల్ ప్రైజ్‌లు గెలుచుకోవడం విశేషం. అయితే ప్రపంచంలోనే రెండు అందుకున్న మొట్టమొదటి వ్యక్తిగా మేడం క్యూరీ రికార్డుల్లోకి ఎక్కారు. ఇక మేడం క్యూరీ కుమార్తె, అల్లుడు కూడా నోబెల్ బహుమతులు అందుకున్నారు. నోబెల్ బహుమతి చరిత్రలో క్యూరీ కుటుంబం నెలకొల్పిన రికార్డు అద్వితీయమైనది. నోబెల్ చరిత్రలో క్యూరీల మైలురాళ్లు1903లో ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో భౌతిక శాస్త్రం విభాగంలో మేరీ క్యూరీ, పియరీ క్యూరీ పేర్లను విజేతలుగా ప్రకటించారు. వీరిద్దరూ రేడియేషన్‌పై చేసిన మార్గదర్శక పరిశోధనలకు గాను హెన్రీ బెకెరెల్‌తో కలిసి ఈ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. 1911లో రసాయన శాస్త్రం విభాగంలో మరోసారి మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి దక్కింది. రేడియం, పోలోనియం మూలకాలను కనుగొన్నందుకు గానూ మేడం క్యూరీకి ఈ పురస్కారం లభించింది. ఇక రెండు వేర్వేరు సైన్స్ విభాగాల్లో రెండు నోబెల్ ప్రైజ్‌లు గెలుచుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తిగా మేరీ క్యూరీ నిలిచారు. ఈ రికార్డు ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం గమనార్హం. 1935లో వెల్లడించిన నోబెల్ బహుమతుల్లో రసాయన శాస్త్రం విభాగంలో మేడం క్యూరీ కుమార్తె, అల్లుడు.. ఇరీన్ జోలియట్ క్యూరీ, ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీలు పురస్కారాన్ని అందుకున్నారు. కృత్రిమ రేడియోధార్మికతను సృష్టించినందుకు.. క్యూరీ జంటకు నోబెల్ వరించింది. ఈ కృత్రిమ రేడియోధార్మికత ఆధునిక అణు వైద్యానికి పునాదులు వేయడం గమనార్హం. ఇక క్యూరీల ఇంట్లో రేడియోధార్మిక నమూనాలతో నిండి ఉండటం వల్ల.. మేడం క్యూరీ ఉపయోగించిన అనేక ల్యాబ్ నోట్‌బుక్‌లు ఇప్పటికీ అంటే వందేళ్ల తర్వాత కూడా సురక్షితంగా తాకలేని విధంగా రేడియోధార్మికతను కలిగి ఉండటం గమనార్హం.మానవాళికి అత్యంత ప్రయోజనం చేకూర్చిన వ్యక్తులు, సంస్థలను ప్రతి సంవత్సరం.. ది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ బహుమతులు ఇచ్చి గౌరవిస్తుంది. డైనమైట్‌ను కనిపెట్టిన స్వీడన్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ తన సంపద మొత్తాన్ని.. ఇలా అనేక పరిశోధనలు చేసిన వారికి బహుమతులు ఇవ్వడం కోసం కేటాయించారు. మొత్తంగా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గుర్తించి.. ఈ నోబెల్ బహుమతులు అందిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో.. ఈ 6 రంగాల్లో విజేతలుగా నిలిచిన వారి పేర్లను ప్రకటిస్తారు. డిసెంబర్ 10వ తేదీన.. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా.. స్టాక్‌హోమ్‌లో సైన్స్, సాహిత్యం బహుమతులు, ఓస్లోలో నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవాలు నిర్వహిస్తారు.