రాష్ట్రంలో కల్తీ లిక్కర్ తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యల ద్వారా ఉక్కుపాదం మోపాలని అధికారులను ఆదేశించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యల ద్వారా పక్క రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికట్టామని చంద్రబాబు వివరించారు. విషయంలోనూ ఇలాగే పనిచేసి.. కల్తీ లిక్కర్ అనేది లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. కల్తీ మద్యం తయారీ కేంద్రాలు కానీ, తయారు చేసే వ్యక్తులు కానీ ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. ఈ విషయంలో పోలీసులు, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మరోవైపు విషయంలో తీసుకున్న చర్యలను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులుగా గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అందులో 12 మందిని అరెస్టు చేశామని, మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ కేసులో ఏ1 అద్దేపల్లి జనార్థన్‌రావుకు సంబంధించిన లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నట్లు వివరించారు. ఈ కేసు ఆధారంగా ఇబ్రహీంపట్నంలో జనార్థన్‌రావు వ్యాపారాలపై తనిఖీలు జరిపామని.. ఈ తనిఖీల్లో కల్తీ మద్యం నిల్వలను గుర్తించినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించిన నిందితుల కాల్ రికార్డులతో పాటు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చంద్రబాబుకు వివరించారు.*ప్రతి ఆరోపణపైనా విచారణ..మరోవైపు కల్తీ మద్యం విషయంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయన్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారని ఆరోపించారు. మంత్రులు అందరూ వైసీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చంద్రబాబు సూచించారు. కల్తీ మద్యం విషయంలో వచ్చే ప్రతీ ఆరోపణపై విచారణ జరపాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మరణాల విషయంలో అవసరమైతే పోస్టుమార్టం వంటి విధానాల ద్వారా మృతికి గల కారణాలు నిర్థారించి...వాస్తవాలు వెల్లడించాలని స్పష్టం చేశారు. సహజ మరణాలపై తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని చంద్రబాబు స్పష్టం చేశారు.