ఆధార్ అప్ డేట్ చేసుకోవాలా.. గుడ్ న్యూస్.. ప్రత్యేక శిబిరాల నిర్వహణ, ఎప్పుడు, ఎక్కడంటే?

Wait 5 sec.

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు మొదలుకొని.. పాఠశాలల్లో చదువులు, దేవాలయాల్లో దర్శనాలు, బస్సులో టికెట్లు.. ఇలా ప్రతి పనిలో ఆధార్ మీదే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో భారత పౌరులకు ప్రతి ఒక్కరికీ ఆధార్ గుర్తింపు కార్డు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. , ఇతరత్రా సేవల కోసం ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు నిర్వహిస్తున్నారు, జాతీయ తపాలా శాఖ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 8వ తేదీ నుంచి 14 వరకూ ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రత్యేక శిబిరాల్లో 5 ఏళ్ల నుంచి17 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు బయోమెట్రిక్, ఆధార్‌ అప్‌డేట్ సేవలను ఉచితంగా అందిస్తారు. మిగిలినవారు సేవలను అనుసరించి నిర్ణీత మొత్తంలో ఫీజు చెల్లించి సేవలు పొందేందుకు అవకాశం ఉంది.ఆధార్ ప్రత్యేక శిబిరాలు.. ఏయే సేవలు అందుబాటులో ఉంటాయంటే? ఆధార్ నమోదు ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ బాలికలకు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవడంబాలురకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ తెరవటం వంటి సేవలు అందిస్తారుకర్నూలు జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు.. ఏ రోజు ఎక్కడంటే అక్టోబర్ 8- 14 కర్నూలుప్రధాన తపాలా కార్యాలయం, అక్టోబర్ 8-9 బాలాజీ నగర్‌ భాష్యం పాఠశాల అక్టోబర్ 10-11 ఎస్‌ఏపీ క్యాంపులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలఅక్టోబర్ 13- 14 సంకల్‌బాగ్‌ భాష్యం పాఠశాలలో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తారు. నంద్యాల జిల్లాలో ప్రత్యేక ఆధార్ శిబిరాలు.. ఎక్కడంటేఅక్టోబర్ 8 -14 నంద్యాల గాంధీచౌక్‌లోని ప్రధాన తపాలా కార్యాలయం అక్టోబర్ 8-9 బస్టాండు సమీపంలోని బాలికోన్నత పాఠశాలఅక్టోబర్ 10- 11 వైఎస్సార్‌ నగర్‌ కస్తూర్బా బాలికోన్నత పాఠశాల (మైనారిటీ)అక్టోబర్ 13 -14 వైఎస్సార్‌ నగర్‌ కస్తూర్బా బాలికోన్నత పాఠశాల, డోన్, పత్తికొండ ప్రధాన తపాలా కార్యాలయాలుమరోవైపు ఆధార్ కార్డులలో పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్, ఫొటో, ఐరిస్, వేలిముద్ర వంటివి మార్పు కోసం 75 రూపాయలు రుసుం వసూలు చేస్తారు. ఐడీ, చిరునామా వంటివాటికి సంబంధించి డాక్యుమెంట్ అప్ డేట్ కోసం ఫీజును రూ.50 నుంచి రూ.75 లకు పెంచారు. బయోమెట్రిక్‌ నవీకరణ రుసుమును రూ.100 నుంచి రూ.125 చేశారు. ఆధార్‌ డౌన్‌లోడ్, ప్రింటింగ్ ఫీజును కూడా రూ.40కు పెంచారు.