IND vs WI: 'లంచ్‌'కి సెంచరీ కూడా లేదు.. నిదానంగా సాగుతున్న భారత్ ఇన్నింగ్స్!

Wait 5 sec.

లో టీమిండియా ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. మొదటి రోజు నుంచి పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో టీమిండియా బ్యాటర్లు మొదటి సెషన్‌లో ఆచితూచి ఆడుతున్నారు. ఓపెనర్లు , మొదటి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం చేయగా.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ సెంచరీ కూడా పూర్తి చేయలేకపోయింది. ఢిల్లీ పిచ్‌పై స్పిన్నర్లు రాణిస్తున్నారు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన టీమిండియా మొదటి సెషన్‌లో తన ఇన్నింగ్స్‌ను నత్తనడకన ముగించింది. వెస్టిండీస్ కూడా కేవలం ఒక్క వికెటే తీసుకుంది. యశస్వి జైస్వాల్ కూడా దొరికిన బంతినే షాట్ ఆడుతూ.. మిగతావి డిఫెన్స్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ విండీస్ స్పిన్నర్ బౌలింగ్‌లో బోల్తా కొట్టి వికెట్ చేజార్చుకున్నాడు. కేఎల్ రాహుల్ 54 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు. విండీస్ స్పిన్నర్ వెర్రికన్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్‌కి వెళ్లి ఆడే ప్రయత్నం చేయగా.. బంతి ఓవర్ స్పిన్ కావడంతో వికెట్ల వెనుక దొరికిపోయాడు. కీపర్ అద్భుతంగా స్టంప్ అవుట్ చేయడంతో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకోకుండానే వికెట్ కోల్పోయాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రాహుల్ రెండో టెస్టులో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ మాత్రం తన బ్యాటింగ్ స్వభావానికి విరుద్ధంగా నిలకడగా ఆడుతున్నాడు. యశస్వి జైస్వాల్ 78 బంతుల్లో ఏడు ఫోర్లతో 40 పరుగులు చేశాడు. కొంతకాలంగా విఫలమవుతూ వస్తున్న సాయి సుదర్శన్ మొదటి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా నిలబడ్డాడు. 36 బంతులు ఆడిన సాయి మూడు ఫోర్లతో 16 పరుగులు చేశాడు. లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 94 పరుగులు చేసింది. 28 ఓవర్లు సాగిన మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఆరుగురు బౌలర్లతో బౌలింగ్ చేయించగా.. వెర్రికెన్‌కు మాత్రం వికెట్ దక్కింది.